మీలాంటి ధైర్యవంతులు, మీలాంటి వాళ్లకు జన్మనిచ్చిన తల్లులకు ఇవే నా కృతజ్ఞతలు అని ప్రధాని నరేంద్ర మోడీ అన్నారు. గాల్వాన్ ఘర్షణలో గాయపడి లేహ్లో చికిత్స పొందుతున్న జవాన్లను ప్రధానమంత్రి నరేంద్ర మోడీ నేడు పరామర్శించారు.
ఈ సందర్భంగా ప్రధాని మాట్లాడుతూ మీరు చూపిన ధైర్యాన్ని నేడు ప్రపంచం మొత్తం విశ్లేషిస్తోందన్నారు. మీరు దేశ ప్రజలకు ఓ ప్రేరణగా నిలిచారన్నారు. మన దేశం ఎన్నడూ ఇతర దేశానికి తలవంచలేదని, ఇకపై కూడా ఏ ప్రపంచశక్తికి తలవంచదని ప్రధానమంత్రి నరేంద్రమోడీ అన్నారు. త్వరలోనే అందరూ కోలుకోవాలని ఆశిస్తున్నట్లు ప్రధాని పేర్కొన్నారు.