బీహార్లో కల్తీ మద్యం తాగి ఏడుగురు చనిపోయారు. కల్తీ మద్యం తాగి మృతి చెందినట్లు బంధువులు ఆరోపిస్తుండగా, అధికార యంత్రాంగం మాత్రం నోరు మెదపడం లేదు. ఈ సారి ఈ సంఘటన సరన్ జిల్లాలోని ఇస్వాపూర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని డోయిలా గ్రామంలో జరిగింది. డోయిలాకు చెందిన సంజయ్ సింగ్ (తండ్రి- వకీల్ సింగ్), విచేంద్ర రాయ్ (తండ్రి-నర్సింగ్ రాయ్),అమిత్ రంజన్ (తండ్రి- విజేందర్ సిన్హా), కునాల్ సింగ్ (తండ్రి- యదు సింగ్), హరేంద్ర రామ్ (తండ్రి- గణేష్ రామ్), రామ్జీ సాహ్ (తండ్రి- గోపాల్ సాహ్) మరియు మష్రాఖ్ పోలీస్ స్టేషన్కు చెందిన ముఖేష్ శర్మ (తండ్రి- బచా శర్మ) మరణించిన వారిలో ఉన్నారు. మంగళవారం రాత్రి నుండి బుధవారం వరకు ఈ మరణాలు సంభవించాయి. మరి కొందరు తీవ్ర అనారోగ్యంతో ఆసుపత్రి పాలయ్యారు. స్థానికంగా చికిత్స పొందుతున్న పలువురి పరిస్థితి విషమంగా ఉండడంతో మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉంది.
previous post