37.2 C
Hyderabad
May 6, 2024 13: 44 PM
Slider జాతీయం

కల్తీ మద్యం తాగి ఏడుగురి మృతి

#liquor

బీహార్‌లో కల్తీ మద్యం తాగి ఏడుగురు చనిపోయారు. కల్తీ మద్యం తాగి మృతి చెందినట్లు బంధువులు ఆరోపిస్తుండగా, అధికార యంత్రాంగం మాత్రం నోరు మెదపడం లేదు. ఈ సారి ఈ సంఘటన సరన్ జిల్లాలోని ఇస్వాపూర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని డోయిలా గ్రామంలో జరిగింది. డోయిలాకు చెందిన సంజయ్ సింగ్ (తండ్రి- వకీల్ సింగ్), విచేంద్ర రాయ్ (తండ్రి-నర్సింగ్ రాయ్),అమిత్ రంజన్ (తండ్రి- విజేందర్ సిన్హా), కునాల్ సింగ్ (తండ్రి- యదు సింగ్), హరేంద్ర రామ్ (తండ్రి- గణేష్ రామ్), రామ్‌జీ సాహ్ (తండ్రి- గోపాల్ సాహ్) మరియు మష్రాఖ్ పోలీస్ స్టేషన్‌కు చెందిన ముఖేష్ శర్మ (తండ్రి- బచా శర్మ) మరణించిన వారిలో ఉన్నారు. మంగళవారం రాత్రి నుండి బుధవారం వరకు ఈ మరణాలు సంభవించాయి. మరి కొందరు తీవ్ర అనారోగ్యంతో ఆసుపత్రి పాలయ్యారు. స్థానికంగా చికిత్స పొందుతున్న పలువురి పరిస్థితి విషమంగా ఉండడంతో మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉంది.

Related posts

పోలీస్ దళం లో చేరుతానంటున్న హిదామి

Bhavani

ఎమ్మెల్సీ ఎన్నికల్లో వాణిదేవికి అన్ని వర్గాల నుంచి సానుకూల స్పందన

Satyam NEWS

నివాస గృహాల మధ్య వైన్ షాపు: మందు బాబులతో సమస్య

Satyam NEWS

Leave a Comment