ఆంధ్రప్రదేశ్ లో కరోనా బారిన పడ్డ ప్రజా ప్రతినిధుల జాబితా పెరిగిపోతూనే ఉంది. తాజాగా అధికార వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి చెందిన గుంటూరు జిల్లా తెనాలి ఎమ్మెల్యే అన్నాబత్తుని శివకుమార్ కు కరోనా పాజిటివ్ నిర్ధారణ అయింది. ఇప్పటికే తెనాలిలోని అన్ని వర్గాలను పట్టిపీడిస్తున్న కరోనా ప్రజాప్రతినిధులను కూడా వదలడం లేదు.
ప్రముఖులను సైతం వదలని మహమ్మారితో ప్రజలు బెంబేలెత్తుతున్నారు. ప్రభుత్వాధికారులు, రాజకీయ నేతలను సైతం కరోనా వైరస్ ఉక్కిరిబిక్కిరి చేస్తున్నది. తెనాలిలో ఇప్పటికే మున్సిపల్ కమిషనర్, తాహసీల్దార్, ప్రభుత్వ ఆసుపత్రి వైద్యులు,పోలీస్ సిబ్బంది వైరస్ బారిన పడ్డారు.