32.7 C
Hyderabad
April 27, 2024 01: 59 AM
Slider కరీంనగర్

కమీషన్ల కోసమే కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణం

#uttamkumarreddy

సీఎం కేసీఆర్ కాలేశ్వరం ప్రాజెక్టు లో 8 శాతం కమిషన్లు దండుకున్నారని, కాళేశ్వరం ప్రాజెక్టు కెసిఆర్ కమీషన్ల కోసమే కట్టించారని ఎంపీ ఉత్తమ్ కుమార్ రెడ్డి ఆరోపించారు. హుజురాబాద్ ఉప ఎన్నికలలో భాగంగా శుక్రవారం ఇల్లంతకుంట మండలంలో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి  బల్మూరి వెంకటేష్ కు మద్దతుగా ఎంపీ ఉత్తమ్ కుమార్ రెడ్డి , వైస్ ప్రెసిడెంట్ టి పి సి సి వేం నరేందర్ రెడ్డి, ఉప్పల్ కాంగ్రెస్ సీనియర్ లీడర్ రాగిడి లక్ష్మారెడ్డి లు కలిసి ప్రచారం నిర్వహించారు .

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఏడున్నర  సంవత్సరాలుగా మంత్రిగా ఉండి ప్రజలకు ఏమి చేయలేని ఈటెల రాజేందర్ ఎమ్మెల్యే గా గెలిస్తే ఏం చేస్తారని ప్రశ్నించారు. కెసిఆర్ ప్రాజెక్టుల్లో కమీషన్లు దండు కుంటే, ఈటెల రాజేందర్  దళితుల దేవాలయ భూములను ఆక్రమించారని  ఆరోపించారు. యువకుడు, విద్యావంతుడు వెంకట్ ను గెలిపిస్తే ప్రశ్నించే గొంతు గా అసెంబ్లీలో మీ తరఫున కొట్లాడు తాడనీ పేర్కొన్నారు. బిజెపి మనువాద పార్టీలో చేరిన ఈటెలకు ఆత్మగౌరవం ఎక్కడుంది అని ఉత్తమ్ కుమార్ రెడ్డి ప్రశ్నించారు.

Related posts

క్రిమినల్ బ్యాచ్: పెళ్లాం సహకారంతో యువతికి ట్రాప్

Satyam NEWS

తిరుపతి స్విమ్స్ క్యాజువాలిటీలో బెడ్ల కొరత తీర్చాలి

Satyam NEWS

మనిషి బతికేయాలంతే

Satyam NEWS

Leave a Comment