అమెరికా లోని వైసీపీ డాక్టర్ల బృందం సహాకారంతో కడప జిల్లా రాజంపేట పట్టణంలో పేదలకు కూరగాయలు పంపిణీ చేసారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే మేడా మల్లిఖార్జున రెడ్డి, జిల్లా వైసీపీ అధ్యక్షుడు అకేపాటి అమర నాధ రెడ్డి,పట్టణ అధ్యక్షుడు పోలా శ్రీనివాసులు రెడ్డి, పసుపు లేటి సుధాకర్, పాపినేని విశ్వనాధ రెడ్డి తదితర వైసీపీ శ్రేణులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.
ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ జగన్మోహన్ రెడ్డి ఏడాది పాలన దిగ్విజయంగా పూర్తి చేసుకున్న తరుణంలో ఎన్నారై లు పేదలకు కూరగాయలు పంపిణీ కి ముందుకు వచ్చారని వారు స్పష్టంచేశారు. ఈ సందర్భంగా వారికి అభినందనలు తెలియజేశారు.