రాష్ట్ర ఎన్నికల కమిషనర్ డాక్టర్.ఎన్.రమేష్ కుమార్ కు ఆంధ్రప్రదేశ్ హైకోర్టు మరో సారి బాసటగా నిలిచింది.
2021 ఓటర్ల జాబితాను అమలు చేయనందున పంచాయితీ ఎన్నికలు రద్దు చేయాలంటూ దాఖలైన 10 లంచ్ మోషన్ పిటిషన్లు ఆంధ్రప్రదేశ్ హైకోర్టు కొట్టేసింది.
కొత్త ఓటర్ల లిస్టు ప్రకారం ఎన్నికలు జరగటం లేదని, అందువల్ల తాము ఓటు హక్కు కోల్పోతున్నామని పలు ప్రాంతాల నుంచి 10 లంచ్ మోషన్ పిటిషన్లు దాఖలు చేశారు.
ఎన్నికల ప్రక్రియ మొదలైన ఈ దశలో విచారణ జరపలేమని పిటిషన్లు హైకోర్టు కొట్టేసింది.