మూడు రాజధానుల వ్యవహారంపై ఆంధ్రప్రదేశ్ హైకోర్టు స్టేటస్కో విధించింది. అంటే యథాతధ స్థితి కొనసాగుతుంది. మళ్లీ విచారణ ఈ నెల 14వ తేదీన జరిపేందుకు నిర్ణయించారు. రాష్ట్ర హైకోర్టు యధాతధ స్థితిని కొనసాగించాలని ఆదేశాలు ఇచ్చినందున రాష్ట్ర ప్రభుత్వం తదుపరి చర్యలు తీసుకోవడానికి అప్పటి వరకూ ఆగాల్సి వస్తుంది.
ప్రభుత్వం తరపు న్యాయవాది కౌంటర్ ఫైల్ చేయడానికి పది రోజులు సమయం కోరారు. దాంతో తదుపరి విచారణ ఆగస్టు14 వాయిదా వేశారు. ఆ లోపు రిప్లై కౌంటర్ దాఖలు చేయాలని ఏపీ ప్రభుత్వానికి కోర్టు ఆదేశం ఇచ్చింది.