నూతన ఆసరా పెన్షన్ పొందేందుకు రాష్ట్ర ప్రభుత్వం అవకాశం కల్పించింది. కుటుంబంలో పెన్షన్ దారుడు చనిపోతే ( భార్య చనిపోతే భర్తకు, భర్త చనిపోతే భార్యకు ) ఆ స్థానంలో కుటుంబంలో ఒకరికి పెన్షన్ పొందే అవకాశం ఉంది.
ఆ కుటుంబంలోని 57 సంవత్సరాలు వయసు పైబడి ఉన్న వారు అర్హులు. అలాంటి వారు మున్సిపాలిటీలో కింద తెలిపిన డాక్యుమెంట్లు జతపరిచి దరఖాస్తు చేసుకోవాలని తెలియజేస్తున్నట్లు కొల్లాపూర్ మున్సిపల్ చైర్మన్ రఘుప్రోలు విజయలక్ష్మి చంద్రశేఖర చారి తెలిపారు.
జతపర్చవలసిన డాక్యు మెంట్లు:
1.చనిపోయిన వారి డెత్ సర్టిఫికెట్.
2.చనిపోయిన వారి ఆధార్ కార్డు.
3.ఇప్పుడు అర్హులైన వారి ఆధార్ కార్డు.
4.ఇప్పుడు అర్హులైన వారి ఫోటో.
5.ఇప్పుడు అర్హులైన వారి బ్యాంకు పాస్ బుక్