సూర్యాపేట జిల్లా హుజూర్ నగర్ నియోజకవర్గ కేంద్రంలోని 2వ,వార్డు ఆంజనేయస్వామి గుడి వెనుక కాలువకట్టపై నివాసం ఉంటూ జీవనం చివరి అంకంలో ఆర్ధికంగా ఇబ్బంది పడుతున్న పెద్దావిడ మలికేశ్వరపు సీతరామమ్మకు జన చైతన్య ట్రస్ట్ తరుపున 25 కేజీల బియ్యం,నిత్యావసర సరుకులను శుక్రవారం అందజేశారు.
జనచైతన్య ట్రస్ట్ చేస్తున్న సేవ కార్యక్రమాలకు అండగా నిలుస్తూ ఉపాధ్యాయుడు సులువ శ్రీను క్వింటా బియ్యం,వెయ్యి రూపాయలు ట్రస్ట్ సభ్యులకు అందజేశారు.ఈ సందర్బంగా ట్రస్ట్ సభ్యులు మాట్లాడుతూ ప్రతి ఒక్కరు సులువ శ్రీను ని ఆదర్శంగా తీసుకోని పదిమందికి సేవ చేసే విధంగా ఉపయోగపడేలా ఉండాలని కోరారు. పేదలకు సాయం చేయడానికి మాకు సహకరించిన సులువ శ్రీను కు ట్రస్ట్ సభ్యులు ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేశారు.
ఈ కార్యక్రమంలో జనచైతన్య ట్రస్ట్ పౌండర్ పినపరాళ్ళ వంశీ, అధ్యక్షుడు పారా సాయి,పిల్లి శివశంకర్,కోడి ఉపేందర్ దగ్గుపాటి రమేష్,శ్రీపతి,సాయి,కాశీ తదితరులు పాల్గొన్నారు.
సత్యం న్యూస్ ప్రతినిధి, హుజూర్ నగర్