కృష్ణాజిల్లా మచిలీపట్నంలో సోమవారం బెల్ కంపెనీ లో అప్రెంటిస్ విద్యార్థి బ్లేడుతో గొంతు కోసుకొని ఆత్మహత్యాయత్నం పాల్పడ్డ సంఘటన సంచలనం సృష్టించింది. కారు అద్దంలో చూసుకుంటూ బ్లేడ్ తో గొంతు
కోసుకుంటున సమయం లో స్థానికులు కేకలు వేయడం భయంతో పరుగులు తీశాడు. గుడ్లవల్లేరు కు చెందిన గాలెంకి దుర్గాప్రసాద్, గుడ్లవల్లేరు
కాలేజ్ లో ఐటిఐ పూర్తి చేసుకున్న అనంతరం మచిలీపట్నం బెల్ కంపెనీలో అప్రెంటిస్ చేస్తున్నాడు. తన తోటి విద్యార్థులకు పని చెబుతున్నారు నాకు ఎటువంటి పని చెప్పడం లేదు తనకి కంప్యూటర్ ఇవ్వడం లేదు అని
మనస్థాపంతో ఆత్మహత్యకు పాల్పడ్డాడు అని సమాచారం. దుర్గ ప్రసాద్ కు పోలియో ఉందని కాళ్లు చేతులు పటిత్వం లేదని అందుకే బెల్ కంపెనీలో మా మేనల్లుడుకు వస్తువులు చేతికి ఇవ్వడం లేదని ఈ విషయం పది రోజులుగా నా మేనల్లుడు నాకు ప్రతిరోజు సాయంత్రం ఫోన్ చేసి దుర్గాప్రసాద్ చెప్పేవాడని దుర్గాప్రసాద్ మావయ్య తెలిపాడు.