37.7 C
Hyderabad
May 4, 2024 13: 55 PM
Slider ముఖ్యంశాలు

ఏప్రిల్ 4 న ఏపీపీఎస్సీ గ్రూప్‌ 4 మెయిన్స్‌ పరీక్ష

#appsc

ఆంధ్రప్రదేశ్‌లోని గ్రూప్‌ -4 ఉద్యోగాల భర్తీకి సంబంధించి మెయిన్స్‌ పరీక్ష తేదీని ఏపీపీఎస్సీ ఖరారు చేసింది. రెవెన్యూ శాఖలో 670 జూనియర్‌ అసిస్టెంట్‌ కమ్‌ కంప్యూటర్ అసిస్టెంట్‌ ఉద్యోగాల భర్తీకి గతంలో నోటిఫికేషన్‌ ఇచ్చిన విషయం తెలిసిందే. ఈ ఉద్యోగ నియామకాలకు సంబంధించి ఇప్పటికే స్క్రీనింగ్ పరీక్ష పూర్తిచేసిన అధికారులు మెయిన్‌ పరీక్షను ఏప్రిల్‌ 4న రెండు షిఫ్టుల్లో నిర్వహించనున్నట్టు  వెల్లడించారు. కంప్యూటర్‌ ఆధారిత విధానంలో జరిగే ఈ పరీక్షకు మార్చి 27 నుంచి అభ్యర్థులు హాల్‌టిక్కెట్లు డౌన్‌లోడ్‌ చేసుకోవచ్చని ఏపీపీఎస్సీ  తెలిపింది. మరోవైపు, ఈ ఉద్యోగాల కోసం గతంలో నిర్వహించిన స్క్రీనింగ్‌ పరీక్షకు 2,11,341 మంది అభ్యర్థులు హాజరు కాగా, వారిలో 11,574 మంది మాత్రమే మెయిన్‌ పరీక్షకు అర్హత సాధించారు.

Related posts

దేశం మొత్తం జరుపుకునే జాతీయ పండుగ ఇది

Satyam NEWS

ఆర్టీసీ కార్మికులకు సిఎం కేసీఆర్ ఇచ్చిన వరాల జాబితా

Satyam NEWS

శివ సాయి నగర్ కాలనీలో… రోడ్డు కబ్జాపై మాజీ కౌన్సిలర్ ఫిర్యాదు

Bhavani

Leave a Comment