ఆంధ్రప్రదేశ్లోని గ్రూప్ -4 ఉద్యోగాల భర్తీకి సంబంధించి మెయిన్స్ పరీక్ష తేదీని ఏపీపీఎస్సీ ఖరారు చేసింది. రెవెన్యూ శాఖలో 670 జూనియర్ అసిస్టెంట్ కమ్ కంప్యూటర్ అసిస్టెంట్ ఉద్యోగాల భర్తీకి గతంలో నోటిఫికేషన్ ఇచ్చిన విషయం తెలిసిందే. ఈ ఉద్యోగ నియామకాలకు సంబంధించి ఇప్పటికే స్క్రీనింగ్ పరీక్ష పూర్తిచేసిన అధికారులు మెయిన్ పరీక్షను ఏప్రిల్ 4న రెండు షిఫ్టుల్లో నిర్వహించనున్నట్టు వెల్లడించారు. కంప్యూటర్ ఆధారిత విధానంలో జరిగే ఈ పరీక్షకు మార్చి 27 నుంచి అభ్యర్థులు హాల్టిక్కెట్లు డౌన్లోడ్ చేసుకోవచ్చని ఏపీపీఎస్సీ తెలిపింది. మరోవైపు, ఈ ఉద్యోగాల కోసం గతంలో నిర్వహించిన స్క్రీనింగ్ పరీక్షకు 2,11,341 మంది అభ్యర్థులు హాజరు కాగా, వారిలో 11,574 మంది మాత్రమే మెయిన్ పరీక్షకు అర్హత సాధించారు.
previous post
next post