ఖమ్మం జిల్లా ముదిగొండ మండలం మెడిపల్లికి చెందిన యువకులు శివ,ఉదయ్,రవీందర్ వివిధ పనుల మీద ఖమ్మం వచ్చారు. పనులు ముగించుకొని రాత్రి 12 గంటలు దాటాక స్వగ్రామానికి బయలుదేరారు. ఈ క్రమంలో ఒకే వాహనం పై వెళ్తున్న ముగ్గురు అతివేగం కారణంగా నగరంలోని చర్చి కాంపౌండ్ వద్ద డివైడర్ ఢీ కొట్టారు. శివ,ఉదయ్ అక్కడిక్కడే మృతి చెందగా తీవ్ర గాయాలైన రవీందర్ ను స్థానికులు ఆసుపత్రి కి తరలించారు.
previous post