33.2 C
Hyderabad
May 4, 2024 01: 16 AM
Slider జాతీయం

సర్టిఫైడ్ బిచ్చగాడు అఖిలేష్ యాదవ్‌ : ఒవైసీ

ఆలిండియా మజ్లిస్ ఏ ఇత్తెహాదుల్ ముస్లిమీన్ అధినేత, ఎంపీ అసదుద్దీన్ ఒవైసీ సమాజ్ వాదీ పార్టీపై వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. సంభాల్‌లోని అస్మోలీ అసెంబ్లీలో ఏఐఎంఐఎం షోషిత్ వంచిత్ సమాజ్ సదస్సులో ఒవైసీ ప్రసంగించారు. సమాజ్‌వాదీ పార్టీ నేతలను ‘బ్రోకర్లు, సర్టిఫైడ్ బిచ్చగాళ్లు’గా అభివర్ణించారు.

సమాజ్‌వాదీ పార్టీ అధ్యక్షుడు అఖిలేష్‌ యాదవ్‌పై అసదుద్దీన్‌ ఒవైసీ తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. మీరు ముఖ్యమంత్రి అయ్యారంటే ముస్లింల ధార్మిక ఓటుతోనేనని అన్నారు. గతంలో అఖిలేష్ యాదవ్ ఏఐఎంఐఎంతో పొత్తు పెట్టుకోవడానికి నిరాకరించారు.

అదే సమయంలో కూటమిలో కూడా భాగస్వామిగా చేర్చుకోవడంలేదని అఖిలేష్ యాదవ్ స్పష్టం చేశారు. అఖిలేష్ యాదవ్ ఈ ప్రకటనపై ఒవైసీ మండిపడ్డారు. కాంగ్రెస్, బీజేపీతో తప్ప ఎవరితోనైనా పొత్తుకు సిద్ధంగా ఉన్నానని అసదుద్దీన్ తెలిపారు.

ఇదిలావుంటే, అసదుద్దీన్ ఒవైసీకి జైలుకు వెళ్లాలంటే భయం పట్టుకుందని కాంగ్రెస్ నేత అజయ్ కుమార్ లల్లూ అన్నారు. CAA నిరసనలో మరణించిన వారి ఇళ్లకు ఆయన వెళ్లలేదని అన్నారు. ఒవైసీతో ఎలాంటి విభేదాలు లేవని అన్నారు.

Related posts

ప్రధాని నరేంద్ర మోడీ పర్యటనలో స్వల్ప మార్పులు

Bhavani

ప్రజలను భయాందోళనకు గురి చేస్తే కఠిన శిక్ష తప్పదు

Satyam NEWS

కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో సంతకాల సేకరణ

Satyam NEWS

Leave a Comment