ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాలలో సచివాలయాల్లో ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తింపబడి ప్రొబేషన్ డిక్లరేషన్ పూర్తి చేసి ఏడాది పూర్తి అయిన వెల్పేర్ అసిస్టెంట్లకు .సచివాలయాలలో వివిధ శాఖలలో విధులు నిర్వహిస్తున్న సిబ్బందికి ఒక ఏడాది ఇంక్రి మెంట్లు మంజూరు చేయడానికి కొంత మంది సంబంధిత అధికారులు బల్లకింద చేతులు చాపుతున్నట్టు
తెలిసింది. ఒక్కొక్క ఉద్యోగినుండి కానీసంగా వెయ్యి నుండి 3 వేలు ముడుపులు ఇస్తే ఇంక్రి మెంట్లు మంజూరు చేస్తామని రహస్య ఒప్పందాలు కుడుచుకున్నట్టు సమాచారం.
అయితే ఇంత వరకు కుదిరిన ఒప్పందం ప్రకారం సచివాలయాల ఉద్యోగుల నుండి సరైన సమాధానం రాకపోవడం తో ఇంత వరకు వేపేర్ అసిస్టెంట్లకు, ఏ ఎన్ ఎం లకు, వెటర్నరీ, హార్టికల్చర్, సర్వేయర్ ల కు ఇంతవరకు ఇంక్రిమెంట్లు మంజూరు కాలేదని తెలిసింది.
అదేవిధంగా సచివాలయాల సిబ్బంది బదిలీల కోసం వేల మంది దరఖాస్తు చేసుకున్నా ఇంతవరకు బదిలీల ప్రక్రియ జరగ లేదని సచివాలయాల సిబ్బంది ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అదేవిధంగా రెగ్యులర్ అయ్యాక మొదటి వేతనం బిల్లులు మంజూరు చేయాలన్నా ముడుపులు ఇవ్వనిదే పైళ్ళు ముందుకు కదలడం లేదనే ఆరోపణలు వెల్లు వెత్తుతున్నాయి.
ఈ ఆరోపణల పై సచివాలయాలలో విధులు నిర్వహిస్తున్న వేపేర్ అసిస్టెంట్ల కు ఇంక్రిమెంట్ల మంజూరులో సంబంధిత శాఖ అధికారి ఒకరు ముడుపులు డిమాండ్ చేస్తున్నారని ఏలూరు జిల్లా సోషల్ వెల్పేర్ జె డి వి జయ ప్రకాష్ ని సత్యం న్యూస్ వివరణ కోరింది. దీనిపై ఆయన స్పందిస్తూ ఇలాంటి ఆరోపణలు గుడివాడ నుంచి వినిపించాయని, మన జిల్లాలో ఇలా జరుగుతున్న విషయం తన దృష్టికి రాలేదని అన్నారు.
ఈ ఆరోపణల పై విచారణ జరిపిస్తామని జయ ప్రకాష్ చెప్పారు. పెదవేగి మండలం గార్లమడుగు సచివాలయం లో విధులు నిర్వహించే వెల్పేర్ అసిస్టెంట్ పెదవేగి మండల పరిషత్ అధికారులపై దురుసుగా దౌర్జన్యంగా వహరించాడని ఫిర్యాదు చేస్తే విచారణాధికారిగా సోషల్ వెల్పేర్ ద్వితీయ స్థాయి అధికారొకరు విచారణ చేసి ఆ విచారణ రిపోర్ట్ ను బుట్టడాఖాలు చేశారని పెదవేగి మండల పరిషత్ అధికారులు చేస్తున్న ఆరోపణలపై కూడా జె డి స్పందించారు. తక్షణమే ఆ విచారణ పై కూడా ఆరా తీస్తానని చెప్పారు