39.2 C
Hyderabad
May 3, 2024 13: 03 PM
Slider నల్గొండ

ఐ ఎన్ టి యు సి మండల మహిళా అధ్యక్షురాలిగా ఎడవెల్లి ధనలక్ష్మి

#INTUC mandal woman

ఐ ఎన్ టి యు సి కార్మిక సంఘం గరిడేపల్లి మండలం అప్పన్నపేట గ్రామానికి చెందిన ఎడవెల్లి ధనలక్ష్మిని గరిడేపల్లి మండల మహిళా అధ్యక్షురాలిగా నియమిస్తూ ఐ ఎన్ టి యు సి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి యరగాని నాగన్న గౌడ్ శుక్రవారం సూర్యాపేట జిల్లా హుజూర్ నగర్ నియోజకవర్గ కేంద్రంలోని పార్లమెంటు సభ్యుడు కెప్టెన్ నలమాద ఉత్తమ్ కుమార్ రెడ్డి క్యాంపు కార్యాలయంలో నియామక పత్రాన్ని అందజేశారు.

ఈ సందర్భంగా యరగాని నాగన్న గౌడ్ మాట్లాడుతూ ఐ ఎన్ టి యు సి అనుబంధ సంఘాలను మరింత బలోపేతం చేయాలన్నారు.కార్మికుల సమస్యలపై కేంద్ర,రాష్ట్ర ప్రభుత్వాలపై పోరాడుతూ కార్మికుల శ్రేయస్సు కొరకై కృషి చేయాలని అన్నారు.రాబోయే ఎన్నికల్లో ఉత్తమ్ కుమార్ రెడ్డి గెలుపు కోసం కృషి చెయ్యాలని,కాంగ్రెస్ పార్టీ గెలుపులో ఐ ఎన్ టి యు సి కార్మికులు భాగస్వాములు కావాలని అన్నారు.ఐ ఎన్ టి యు సి యూనియన్,పార్టీ బలోపేతానికి అహర్నిశలు కృషి చేయాలని కోరారు.

ఎడవెల్లి ధనలక్ష్మి మాట్లాడుతూ తనపై ఎంతో నమ్మకంతో గరిడేపల్లి మండల ఐ ఎన్ టి యు సి కార్మిక సంఘానికి అధ్యక్షురాలిగా నియమించిన రాష్ట్ర ప్రధాన కార్యదర్శి యరగాని నాగన్న గౌడ్ కి ప్రత్యేక కృతజ్ఞతలు తెలుపుతూ శక్తి వంచన లేకుండా అహర్నిశలు కాంగ్రెస్ పార్టీ కి,కార్మిక సంఘానికి సేవచేస్తూ కాంగ్రెస్ పార్టీ గెలుపే ధ్యేయంగా కృషి చేస్తానని అన్నారు.

ఈ కార్యక్రమంలో హుజూర్ నగర్ పట్టణ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు తన్నీరు మల్లిఖార్జున్ రావు,హుజూర్ నగర్ నియోజకవర్గ ఐ ఎన్ టి యు సి అధ్యక్షుడు బెల్లంకొండ గురవయ్య, నియోజకవర్గ ప్రధాన కార్యదర్శి గుంటిక కరుణాకర్ రెడ్డి,నియోజకవర్గ మహిళా అధ్యక్షురాలు చప్పిడి సావిత్రి,పట్టణ అధ్యక్షుడు పాశం రామరాజు,జిల్లా నాయకులు చింతకాయల రాము,ఫార్ బాయిల్డ్ రైస్ మిల్ డ్రైవర్స్ యూనియన్ అధ్యక్షుడు సలిగంటి జానయ్య,బ్లాక్ ఐ ఎన్ టి యు సి అధ్యక్షుడు షేక్ ముస్తాఫా, హుజూర్ నగర్ మండల మహిళా అధ్యక్షురాలు గడ్డం వెంకటమ్మ,కాల్వ పెద్ద వేంకటేశ్వరావు,మల్లయ్య తదితరులు పాల్గొన్నారు.

సత్యం న్యూస్ ప్రతినిధి, హుజూర్ నగర్

Related posts

శ్రీకృష్ణ సత్యభామ రూపిణీ సమేత కళ్యాణం

Satyam NEWS

మానవ హక్కుల కమిషన్ కార్యాలయంలో పతాకావిష్కరణ

Satyam NEWS

కరోనా నివారణకు మాస్కులు ధరించకుంటే చర్యలు

Satyam NEWS

Leave a Comment