జిల్లాలో మద్యం షాపుల లాటరీ ఈ నెల 21వ తేదీన చేపట్టబడునని జిల్లా ఎక్సైజ్ సూపరింటెండెంట్ నాగేంద్ర రెడ్డి తెలిపారు. జిల్లాలో 122 మద్యం షాపులకు గాను ఈ నెల 4 నుండి 18 వరకు దరఖాస్తులు స్వీకరించినట్లు, జిల్లాలో మొత్తం 7207 దరఖాస్తులు అందినట్లు ఆయన అన్నారు.
ఉదయం 10.00 గంటలకు సీక్వెల్ రిసార్ట్స్ (లేక్ వ్యూ ఫంక్షన్ హాల్), లకారం రిక్రియేషన్ జోన్, ఖమ్మం నందు లక్కీ లాటరీ డ్రా చేపట్టబడుతుందని ఆయన తెలిపారు.
దరఖాస్తుదారులు, దరఖాస్తుదారునిచే ఆథరైజ్ చేయబడిన వ్యక్తిని మాత్రమే డ్రా కి అనుమతిస్తామని ఆయన అన్నారు. దరఖాస్తుదారులు, దరఖాస్తుదారుచే ఆథరైజ్ చేయబడ్డ వారు ఉదయం 10.00 గంటలకు సీక్వెల్ రిసార్ట్స్ లో చేపట్టే లక్కీ డ్రాకు హాజరుకావాలని ఎక్సైజ్ సూపరింటెండెంట్ పేర్కొన్నారు.