38.2 C
Hyderabad
April 28, 2024 22: 35 PM
Slider పశ్చిమగోదావరి

వంటరి మహిళను మోసం చేసిన వ్యక్తి అరెస్టు

#elurupolice

భర్త నుంచి దూరంగా ఉంటున్న ఒక మహిళపై వలపు వల విసిరాడు ఒక వ్యక్తి. అది నిజమని నమ్మిన ఆమె అతడికి లొంగిపోవడంతో గర్భం దాల్చింది. తీరా చూస్తే అతడు మాయగాడని తెలుసుకుని పోలీసుసులకు ఆశ్రయించిందామె. ఏలూరులో ఈ సంఘటన జరిగింది. ఏలూరు మండలం పోణంగి గ్రామానికి ఒక మహిళ తన భర్తతో మనస్పర్థలు రావడంతో విడాకులు తీసుకుంది.

ఆమె తన తలితండ్రులు తో ఉంటూ ఏలూరు గవర్నమెంట్ ఆసుపత్రి మెస్ కాంట్రాక్టర్ వద్ద సహాయకురాలిగా చేరింది. అదే మెస్ లోనే  లింగపాలెం మండలం, అస్సన్నగూడెం గ్రామానికి చెందిన  కందుకూరిరి సాయి కృష్ణ అనే వ్యక్తి కూడా పని చేస్తూ వున్నాడు.

ఆమె భర్త కు దూరంగా ఉంటుందని తెలుసుకొని, దానిని  ఆసరాగా చేసుకొని ఆమెకు మయా మాటలు చెప్పి పెళ్లి చేసుకుంటాను అని అతను లోబరచుకున్నాడు. ఆమె ఇష్టానికి వ్యతిరేకంగా బలవంతం గా అత్యాచారo చేసి ఆమెను గర్భవతి ని చేశాడు. గర్భవతి అయిన తర్వాత మొహం చాటేయడంతో ఆమె పోలీసులను ఆశ్రయించింది.

ఏలూరు 2 టౌన్ సిఐ డి వి రమణ కేసు నమోదు చేసి దర్యాప్తు చేశారు. ముద్దాయి కందుకూరి సాయి కృష్ణ ను ఏలూరు విజయ విహార్ సెంటర్ వద్ద అరెస్ట్ చేశారు.

Related posts

ప్రజావాణి కి చేరిన కొల్లాపూర్ కోట అక్రమ నిర్మాణాల అంశం

Satyam NEWS

క్రీడా సామాగ్రి కొనుగోలుకు నిధుల విడుదల

Bhavani

వాసవి కన్యకాపరమేశ్వరి గుడిపై అధికారుల ప్రతాపం

Satyam NEWS

Leave a Comment