గ్రేటర్ హైదరాబాద్ పరిధిలోని ఆటో కార్మికుల సమస్యల పరిష్కరించెందుకు తన వంతు కృషి చేస్తానని జిహెచ్ఎంసి మాజీ మేయర్ బొంతు రామ్మోహన్ అన్నారు.ఆదివారం ఉప్పల్ నియోజకవర్గం చర్లపల్లి డివిజన్ సిరి గార్డెన్ లోని గట్స్ కార్మిక విభాగం రాష్ట్ర అధ్యక్షుడు వేముల కృష్ణ ఆధ్వర్యంలో శ్రమ జీవుల సంబరాలు (మే డే) ఘనంగా నిర్వహించారు.
ఈ కార్యక్రమనికి ముఖ్య అతిదులుగా బొంతు రామ్మోహన్, మాజీ కార్పొరేటర్ గోల్లూరు అంజయ్య, స్థానిక కార్పొరేటర్ బొంతు శ్రీదేవి హాజరై నూతనంగా ఏర్పాటైన గట్స్ కార్మిక సంఘం కమిటి సభ్యులకు శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ సందర్భంగా బొంతు రామ్మోహన్ మాట్లాడుతూ. సీఎం కేసీఆర్ కార్మిక పక్షపాతి అని, మే నెల మొత్తం కార్మికులను చైతన్య పరిచేందుకు కార్మిక చైతన్య మాసోత్సవాలు నిర్వహిస్తున్నామని తెలిపారు.
రాష్ట్రంలో కార్మికుల అభివృద్ధికి ప్రభుత్వం పెద్ద పీట వేస్తొందన్నారు. రాబోయే రోజుల్లో గట్స్ కార్మిక సంఘం రాష్ట్రంలో అతిపెద్ద కార్మిక సంఘం పేరు ప్రతిష్టలు ఘడించాలని ఆకాంక్షించారు. పగలు రాత్రి తేడా లేకుండా ఆటో నడుపుతూ నిత్యం ప్రజలను వారి గమ్య స్థానం లో చేర్చేందుకు ఆటో కార్మికులు ముందుంటారని రామ్ మోహన్ కొనియాడారు. తెలంగాణ ప్రభుత్వం కార్మికుల కోసం చేపట్టిన సంక్షేమ పథకాలను సద్వినియోగం చేసుకోవాలని సూచించారు.
ఆటో డ్రైవర్లు అందరూ ఐక్యమత్యంతో ఉంటే అనుకున్నవన్నీ సాధించుకోగలుగుతారనీ పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో తెరాస నాయకులు బాన్నల ప్రవీణ్ ముదిరాజ్,రేగెళ్ల సతీష్ రెడ్డి, బాల్ రెడ్డి,విద్యాసాగర్, కోల నరేష్ గౌడ్, ప్రభూ గౌడ్, బాబు గంగా పుత్ర, కార్మిక సంఘం నాయకులు గడ్డం శ్రీనివాస్, బాల రాజ్ యాదవ్, భూపతి బాలరాజు, గంజేవర్ రావు తదితరులు పాల్గొన్నారు