సీఎం జగన్ ను విజయనగరం ఎమ్మెల్యే కోలగట్ల వీరభద్రస్వామి సాయంత్రం తాడేపల్లిలోని క్యాంపు కార్యాలయంలో మర్యాదపూర్వకంగా కలిశారు.
రాష్ట్ర వ్యాప్తంగా నగరపాలక, మున్సిపల్ ఎన్నికలలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ విజయం సాధించడం పట్ల సీఎం జగన్.. ఎమ్మెల్యే కోలగట్ల పుష్పగుచ్ఛం ఇచ్చి అభినందనలు తెలియజేశారు.
అదే సమయంలో జిల్లాలో మరియు విజయనగరం నగరపాలక ఎన్నికల లో 50 స్థానాలకు గాను 48 స్థానాలు లో వైఎస్సారెస్పీ అభ్యర్థుల గెలుపునకు కృషి చేసిన ఎమ్మెల్యే కోలగట్ల ను కూడా సీఎం జగన్ అభినందించారు.
రాబోయే జెడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికల్లో కూడా ఇదే ఒరవడి ని సృష్టించాలని సీఎం జగన్ ఎమ్మెల్యే కోలగట్ల తో అన్నారు. వీరిరువురు పలు అంశాలతో పై చర్చించారు.
ముఖ్యమంత్రిని కలిసిన వారిలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతలు కాయల వెంకటరెడ్డి, ఎంకే బి శ్రీను తదితరులు ఉన్నారు.