37.2 C
Hyderabad
April 26, 2024 19: 18 PM
Slider నల్గొండ

రక్తదానంతో మరో ప్రాణం కాపాడిన డి ఎస్ ఆర్ ట్రస్ట్

#blooddonation

డి ఎస్ ఆర్ ట్రస్ట్ రక్తదానం చేసి మరో ప్రాణాన్నికాపాడింది. సూర్యాపేట జిల్లా హుజూర్ నగర్ నియోజకవర్గ మఠంపల్లి మండలం భిల్యా నాయక్ తండ కి చెందిన  మహిళ అనారోగ్యంతో హుజూర్ నగర్ లోని ప్రైవేట్ హాస్పిటల్ చేరింది. ఆమెకు చేయాల్సిన పెద్ద ఆపరేషన్ కి రక్తం అవసరం అయింది.

‘ఓ’ పాజిటివ్ రక్తం తక్కువగా ఉండటంతో కుటుంబ సభ్యులు పట్టణంలోని డి ఎస్ ఆర్ ట్రస్ట్  చైర్మన్ దగ్గుపాటి బాబురావు కి సమాచారం అందించారు. దాంతో తక్షణమే స్పందించిన డి ఎస్ ఆర్ ట్రస్ట్ పట్టణానికి చెందిన కారు డ్రైవర్ షేక్ నాగుల్ మీరా కి సమాచారం అందించారు. దాంతో నేనున్నాను అంటూ నాగుల్ మీరా ముందుకు వచ్చి రక్తదానం చేశాడు.

ఈ సందర్భంగా షేక్ నాగుల్ మీరా మాట్లాడుతూ డిఎస్ఆర్ ట్రస్ట్ తరఫున ఇప్పటికీ ఆరు మార్లు రక్తదానం చేసినట్లు చెప్పారు. ఆపదలో ఉన్నవారికి రక్తదానం చేయటం తనకు  చాలా సంతోషకరంగా ఉందని అన్నారు.  ఆపదలో ఉన్నవారికి మన వంతుగా ఏదో రకంగా సహాయం చేయాలని,ప్రతి ఒక్కరు ఆలోచించి రక్త దానం కొరకు ముందడుగు వేయాలని అన్నారు. ట్రస్ట్ చైర్మన్ బాబూరావు మాట్లాడుతూ మీరు చేసిన ఈ రక్తదానం మరొకరి ప్రాణాలను కాపాడుతుందని, రక్తదాతలకు ట్రస్ట్ తరపున ప్రత్యేక కృతజ్ఞతాభినందనలు తెలియజేశారు.

సత్యం న్యూస్, హుజూర్ నగర్

Related posts

సెటిలర్లు ఎటు ‘హుజూర్’ అంటే అటే

Satyam NEWS

వైసీపీ ప్రభుత్వ వన్ టైమ్ దోపిడిని అడ్డుకుందాం

Satyam NEWS

వరల్డ్ బుక్ ఆఫ్ రికార్డ్స్ హోల్డర్ గా రోహిత్ కుమార్

Satyam NEWS

Leave a Comment