40.2 C
Hyderabad
May 5, 2024 17: 21 PM
Slider హైదరాబాద్

పద్మజా ఆస్పత్రి డాక్టర్లకు యాక్సిస్ బ్యాంక్ ప్రత్యేక అభినందనలు

#padmajahospital

కోవిడ్ విజృంభిస్తున్న తరుణంలో రోగులకు ఉత్తమ సేవలు అందిస్తూ వారి ప్రాణాలు కాపాడిన పద్మజా ఆస్పత్రి వైద్యులను, సిబ్బందిని రోడ్డు నెంబర్ వన్ యాక్సిస్ బ్యాంక్ శాఖ వారు ఘనంగా సన్మానించారు.

ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ వైద్యో నారాయణ హరి అన్న నానుడిని నిజం చేస్తూ కరోనా సమయంలో ప్రాణాలకు తెగించి రోగులను కాపాడిన వైద్యుల సేవలు వెలకట్టలేనివన్నారు. వారికి ఎన్ని సన్మానాలు చేసినా, ఎంత పొగిడిన తక్కువేనన్నారు.

పద్మజా ఆస్పత్రి ఛైర్మెన్ హన్మంతరావు మాట్లాడుతూ  అనారోగ్యంతో తమ దగ్గరకు వచ్చే ప్రతీ ఒక్క రోగికి అత్యుత్తమ వైద్య సేవలు అందించి వారిని సంపూర్ణ ఆరోగ్యవంతులుగా ఇంటికి పంపండమే తమ ముఖ్య ఉద్దేశమన్నారు.

ఈ కరోనా కష్ట సమయంలో ప్రాణాలు పణంగా పెట్టి ఉత్తమ సేవలు అందించిన వైద్య సిబ్బందిని హన్మంతరావు ప్రత్యేకంగా అభినందించారు.

ఈ కార్యక్రమంలో డాక్టర్లు శ్రీనివాస్, అరిఫ్ ఉద్దీన్, అంజిరెడ్డి, ఇతర వైద్య సిబ్బంది, యాక్సిస్ బ్యాంక్ మేనేజర్ వరుణ్ చౌదరి ఇతర బ్యాంకు సిబ్బంది పాల్గొన్నారు.

సత్యం న్యూస్, కూకట్ పల్లి

Related posts

నారాయణరావుపేటలో బీఆర్ఎస్ పార్టీ ఆత్మీయ సమ్మేళనం

Bhavani

డోంట్ రిపీట్: ఒకసారి కొట్టేసాక పిటిషన్ మళ్ళీ వేస్తారా

Satyam NEWS

కేసీఆర్ పెద్ద కొడుకు అసదుద్దీన్ ఓవైసీ

Satyam NEWS

Leave a Comment