జయశంకర్ భూపాలపల్లి జిల్లా మొగుళ్లపల్లి మండల కేంద్రంలో పుట్టిన చిన్న పిల్లలను నుంచి 19 సంవత్సరాల వయసు గల వారికి నులిపురుగుల నట్టల మందులు వేసే కార్యక్రమాన్ని మొగుళ్లపల్లి గ్రామ సర్పంచ్ మోటే ధర్మారావు ప్రారంభించారు. ఈ సందర్భంగా సర్పంచ్ ధర్మారావు మాట్లాడుతూ చిన్న పిల్లలకు నట్టల మందు వేయడం వల్ల వారు రోగాల భారీన పడకుండా కాపాడవచ్చాన్నారు. ఈ కార్యక్రమంలో ఎంపీటీసీ ఎర్రబెల్లి వనిత పూర్ణచందర్రావు, ఉప సర్పంచ్ సరోజన బాబురావు, ఏఎన్ఎం శ్రీలత, పంచాయతీ కార్యదర్శి దామోదర్, కారోబార్ అబ్బు, అంగన్వాడీ టీచర్లు, ఆశా వర్కర్లు తదితరులు పాల్గొన్నారు.