తెలుగుదేశం అధినేత నారా చంద్రబాబు నాయుడు ఖమ్మం పర్యటన సందర్భంగా ఈ నెల 21న జరిగే బహిరంగ సభను విజయవంతం చేయాలని ఖమ్మo వ్యవసాయ మార్కెట్ లో రైతులు, వ్యాపారస్థులను రాష్ట్ర ప్రధాన కార్యదర్శి తాళ్లూరి జీవన్ కుమార్ ఆధ్వర్యంలో కలిసి ప్రచారం చేశారు. ప్రభుత్వ కళాశాల మైదానంలో జరిగే ఈ సభ ద్వారా రాష్ట్ర రాజకీయాలలో మార్పు రావాలని పిలుపునిచ్చారు. జీవన్ తో పాటు ఖమ్మం పార్లమెంట్ నాయకులు రాష్ట్ర కార్యదర్శి తోటకూరి శివయ్య , రాష్ట్ర కార్యదర్శి చేతుల నాగేశ్వరరావు , పార్లమెంట్ ఉపాధ్యక్షులు కొండబాల కరుణాకర్ , ఆర్గనైజింగ్ కార్యదర్శి నాగార్జున శ్రీనివాస్, నాయకులు కర్నాటి సీతారాములు పాలడుగు క్రిష్ణ ప్రసాద్ పలువురు వ్యాపారులు రైతులు పాల్గొన్నారు.