బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ మంత్రి వర్యులు కేటీఆర్ పిలుపు మేరకు బీఆర్ఎస్ పార్టీ ఆవిర్భావ దినోత్సవ వేడుకల్లో భాగంగా అంబర్ పేట ఎమ్మెల్యే కాలేరు వెంకటేష్ ఆధ్వర్యంలో మంగళవారం కాచిగూడ క్రాస్ రోడ్డులోని మున్నూరు కాపు సంఘం భవనంలో అంబర్ పేట నియోజకవర్గ బీఆర్ఎస్ పార్టీ సర్వసభ్య సమావేశం ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్, సికింద్రాబాద్ పార్లమెంట్ నియోజకవర్గ బీఆర్ఎస్ పార్టీ ఇంఛార్జ్ తలసాని సాయికిరణ్ యాదవ్ హాజరయ్యారు. కార్యక్రమానికి ముందు ఎమ్మెల్యే కాలేరు వెంకటేష్ అంబర్ పేట నియోజకవర్గంలోని ఐదు డివిజన్లలో బీఆర్ఎస్ పార్టీ జెండాను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే కాలేరు వెంకటేష్ మాట్లాడుతూ, దేశంలో ఎక్కడా లేని విధంగా ముఖ్యమంత్రి కేసీఆర్ నాయకత్వంలో తెలంగాణ ప్రభుత్వం ఎన్నో అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలను చేపడుతోందని పేర్కొన్నారు. బీఆర్ఎస్ ప్రభుత్వం చేపడుతున్న అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలను ప్రజల్లోకి బలంగా తీసుకువెళ్లాలని పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చారు. అలాగే వచ్చే ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా ప్రతీ ఒక్కరూ ఒక సైనికుడిలా పని చేయాలని దిశానిర్దేశం చేశారు. ఈ కార్యక్రమంలో అంబర్ పేట కార్పొరేటర్ విజయ్ కుమార్ గౌడ్, నియోజకవర్గంలోని ఐదు డివిజన్ల పార్టీ అధ్యక్షులు, పార్టీ నాయకులు, మహిళా నాయకులు, కార్యకర్తలు మరియు అభిమానులు తదితరులు పాల్గొన్నారు
సత్యం న్యూస్, అంబర్పేట్