33.2 C
Hyderabad
May 15, 2024 21: 05 PM
Slider హైదరాబాద్

హైదరాబాద్ లో దారుణం. యువతి ఆత్మహత్య

#Young woman

హైదరాబాద్‌లో మరో దారుణం జరిగింది. సినిమాల్లో అవకాశం కల్పిస్తానని మోసం చేయడంతో మనస్థాపం చెంది ఓ యువతి ఆత్మహత్యకు పాల్పడింది.ఈ ఘటన రాయదుర్గం పోలీస్ స్టేషన్ పరిధిలోని ల్యాంకోహిల్స్‌లో జరిగింది. వివరాల ప్రకారం.. బిందు శ్రీ అనే యువతి కొన్ని సంవత్సరాలుగా పూర్ణచందర్ రావు ఇంట్లో చిల్డ్రన్ కేర్ టేకర్‌గా పని చేస్తోంది.

అయితే, సినీ పరిచయాలు ఉన్న పూర్ణచందర్ రావు బిందు శ్రీకి సినిమాల్లో అవకాశం కల్పిస్తానని ఆశ చూపాడు. కానీ, పూర్ణ చందర్ రావు సినిమా ఆశ చూపి తనను మోసం చేశాడని చివరకు బిందు శ్రీ గ్రహించింది. ఈ విషయంపైనే ఈ నెల 11వ తేదీన వీరిద్దరి మధ్య అర్థరాత్రి తీవ్ర వాగ్వదం జరిగింది.

ఈ గొడవ జరిగిన కాసేపటికే బిందు శ్రీ ల్యాంకో హిల్స్‌లోని 21వ అంతస్తు నుంచి దూకి ఆత్మహత్యకు పాల్పడింది. దీంతో మృతురాలి తండ్రి పోలీసులకు ఫిర్యాదు చేశాడు. బిందు శ్రీ తండ్రి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు పూర్ణ చందర్ రావును అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించారు

Related posts

సీక్రెట్: కడప టిడిపి నేతకు తెలంగాణ హస్తానికి లింకు?

Satyam NEWS

పేస్కేల్ అమలు కోరుతూ తాసిల్దార్ కార్యాలయాల ఎదుట నిరసన

Satyam NEWS

ప్రజల పై భారం మోపే జీవోలను ప్రభుత్వం ఉపసంహరించుకోవాలి

Satyam NEWS

Leave a Comment