29.7 C
Hyderabad
May 6, 2024 06: 15 AM
Slider ముఖ్యంశాలు

కాంగ్రెస్ లో చేరనున్న బిఆర్ఎస్ ఎంపీ?

#BRS

కాంగ్రెస్ పార్టీలోకి వలసలు కొనసాగుతున్నాయి. తాజాగా బీఆర్ఎస్ పార్టీకి చెందిన కీలక నేత ఒకరు కాంగ్రెస్ పార్టీలో చేరనున్నారని సమాచారం.నాగర్ కర్నూల్ ఎంపీ రాములు పార్టీ మారనున్నారని ప్రచారం జరుగుతోంది. ఎంపీ రాములుతో ఇప్పటికే సునీల్ కనుగోలు టీమ్ టచ్‌లోకి వెళ్లినట్టు తెలుస్తోంది.

రాములు అచ్చంపేట ఎమ్మెల్యే టికెట్ అడుగుతున్నట్టు సమాచారం. టికెట్ ఇచ్చేందుకు కాంగ్రెస్ అంగీకరిస్తే ఆయన పార్టీ మారడం ఫిక్స్ అవుతుందంటూ జోరుగా ప్రచారం సాగుతోంది.కొద్ది నెలలుగా ఎంపీ రాములు బీఆర్ఎస్‌లో అసంతృప్తితో కొనసాగుతున్నారు. అచ్చంపేట ఎమ్మెల్యే టికెట్ అడుగుతున్నారు.

అయితే ప్రస్తుతం అచ్చంపేట లో సిట్టింగ్ ఎమ్మెల్యే గా గువ్వల బాలరాజు ఉన్నారు. అచ్చంపేట అభ్యర్థి మార్పుపై ఇప్పటి వరకూ సీఎం కేసీఆర్ ఎలాంటి స్పష్టతనూ ఇవ్వలేదు. తనకు బీఆర్ఎస్‌లో ఎమ్మెల్యే టికెట్ రాదనే భావనలో ఎంపీ రాములు ఉన్నట్టు తెలుస్తోంది. దీంతో పార్టీ మార్పుపై హస్తం నేతలతో రహస్య మంతనాలు సాగిస్తున్నారు.

Related posts

26న జాతీయ కార్మిక సంఘాల దేశ వ్యాప్త సమ్మె

Satyam NEWS

శ్రీలక్ష్మీ నరసింహ స్వామి వారిని దర్శించుకున్న మంత్రి ఎర్రబెల్లి

Bhavani

వైకాపా తొత్తులకే నా వ్యాఖ్యలు వర్తిస్తాయి: బత్యాల

Satyam NEWS

Leave a Comment