ఉమ్మడి మహాబూబ్ నగర్ జిల్లా జడ్చర్ల కు చెందిన బాల త్రిపుర సుందరి బీజేపీ లో చేరారు. నేడు బిజెపి రాష్ట్ర కార్యాలయంలో బిజెపి రాష్ట్ర అధ్యక్షులు, పార్లమెంట్ సభ్యులు బండి సంజయ్ కుమార్ సమక్షంలో ఆమె పార్టీ తీర్థం తీసుకున్నారు. లండన్ లో సాఫ్ట్వేర్ కంపెనీలో పలు హోదాల్లో విధులు నిర్వర్తించిన ఆమె గత కొన్ని సంవత్సరాల క్రితం స్వదేశానికి తిరిగి వచ్చి వ్యాపార రంగంలో స్థిరపడ్డారు. పలు సామాజిక, సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. బీజేపీ సిద్ధాంతాలు, విధానాలకు ఆకర్షితులై పార్టీలో చేరుతున్నట్లు బాలా త్రిపుర సుందరి చెప్పారు. ఈ కార్యక్రమంలో నిజామాబాద్ పార్లమెంట్ సభ్యులు ధర్మపురి అరవింద్, బిజెపి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గుజ్జుల ప్రేమేందర్ రెడ్డి, బిజెపి రాష్ట్ర కార్యదర్శి కొల్లి మాధవి, బిజెపి రాష్ట్ర కోశాధికారి భండారి శాంతి కుమార్, బిజెపి ఎస్సీ మోర్చా జాతీయ కార్యదర్శి ఎస్ కుమార్, మైనారిటీ మోర్చా రాష్ట్ర అధ్యక్షులు అఫ్సర్ పాషా, బిజెపి సీనియర్ నాయకులు నాగూరావు నామాజీ, మిథున్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.
previous post
next post