37.7 C
Hyderabad
May 4, 2024 11: 28 AM
Slider ప్రకాశం

తాడేపల్లి క్యాంపు కార్యాలయంకు బాలినేని

#balinenisrinivasareddy

తాడేపల్లి సీఎం క్యాంపు కార్యాలయానికి మాజీ మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి చేరుకున్నారు. ఒంగోలులో చోటు చేసుకున్న తాజా పరిణామాలపై సీఎంఓ అధికారి ధనుంజయ రెడ్డితో ముందుగా బాలినేని చర్చించనున్నారు. రెండు రోజుల క్రితం ప్రకాశం జిల్లాలో పోలీసుల తీరుని నిరశిస్తూ గన్‌మెన్‌లను ఆయన సరెండర్ చేశారు. హైదరాబాద్ నుంచి పోలీసు ఎస్కార్ట్ వాహనం, గన్ మెన్‌లు లేకుండానే తాడేపల్లికి బాలినేని వచ్చారు. ధనుంజయ రెడ్డితో భేటీ అనంతరం మధ్యాహ్నం 3 గంటలకు సీఎం జగన్‌ని కలిసే అవకాశం ఉంది. మంత్రి పదవి కోల్పోయినప్పటి నుంచి వైసీపీ లో ప్రాధాన్యత తగ్గిందనే భావనలో బాలినేని ఉన్నారు. పార్టీలో, ప్రభుత్వ అధికారుల వద్ద తన మాటకి విలువ లేకుండా పోయిందని సన్నిహితుల వద్ద బాలినేని అసహనం వ్యక్తం చేసినట్టు తెలుస్తోంది.

Related posts

బీజేపీ లో చేరిన మరో తెలుగుదేశం గూటి పక్షి

Satyam NEWS

లేడీ బాస్: ప‌నితీరుతో సిబ్బందికి వ‌ణుకు పుట్టిస్తున్న విజయనగరం ఎస్పీ

Satyam NEWS

ఆమ్ ఆద్మీ పార్టీ ఎమ్మెల్యేపై ఏసీబీ దాడి

Satyam NEWS

Leave a Comment