మీతో రక్షాబంధన్ సంబరాలు జరుపుకోవడం మా అదృష్టంగా భావిస్తున్నానని బండి సంజయ్ అన్నారు.సృష్టికి మూలం స్త్రీలే. ..అన్నింటిలో మాత(భూమాత, గోమాత, భారత్ మాత, గోదావరి మాత, అగ్నిమాత) నే తలుచుకుంటాం. వీళ్లందరినీ స్త్రీ తోనే పోలుస్తామని బండి సంజయ్ అన్నారు.
మహిళలకు రాజకీయపరంగా… పార్టీ పరంగా ప్రధాని మోదీ అత్యధిక ప్రాధాన్యత ఇస్తున్నారన్నారు. నలుగురు మహిళలను సీఎం లను చేశాం…6 గురు మహిళలను గవర్నర్ లను చేశాం.. 12 మంది మహిళా ఎంపీ లను మంత్రులను చేశాం. చివరికి దేశ అత్యున్నత పీఠంపై ఎస్టీ మహిళను రాష్ట్రపతిగా కూర్చోబెట్టామని సంజయ్ అన్నారు.
మహిళలకు ప్రాముఖ్యతను, ప్రాధాన్యతను ఇచ్చే పార్టీ భారతీయ జనతా పార్టీ అని అన్నారు.మహిళలలో ఒక అమ్మవారిని తలుస్తూ… అమ్మవారిని కొలుస్తూ… అమ్మవారిని పూజిస్తూ… స్త్రీ శక్తిని చాటే వ్యక్తి మోడీ అని బండి కొనియాడారు.ప్రజా సంగ్రామ యాత్ర ద్వారా టిఆర్ఎస్ ప్రభుత్వ మోసాలను ఎండగట్టేందుకు… కేంద్ర ప్రభుత్వ సంక్షేమ పథకాలను వివరించేందుకే పాదయాత్ర చేస్తున్నానన్నారు.ప్రజలకు భరోసా కల్పించేందుకే పాదయాత్ర చేస్తున్నా..రాబోయే రోజుల్లో తెలంగాణ రాష్ట్రంలో పేదల ప్రభుత్వం రావాలనే పాదయాత్ర చేస్తున్నానన్నారు.
కెసిఆర్ గడీలను బద్దలుకొట్టి, పేదల ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తామని బండి సంజయ్ అన్నారు.
పల్లివాడ ప్రజలందరినీ ఎప్పటికీ మర్చిపోనన్నారు. అమ్మ వారి ఆశీస్సులతో మీరందరూ నిత్యం సుఖసంతోషాలతో అష్టైశ్వర్యాలతో ఉండాలని అమ్మవారిని ప్రార్థిస్తున్నానన్నారు జై భారత్ మాత’ అని తన ప్రసంగాన్ని ముగించారు… టీ బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు, ఎంపీ బండి సంజయ్.