గడప గడపకు కాంగ్రెస్ పార్టీ ప్రచార కార్యక్రమాన్ని ఆ పార్టీ జిల్లా నాయకులు పొంగులేటి ప్రసాద్ రెడ్డి పాలేరు నియోజకవర్గం పరిధిలోని కూసుమంచి మండలంలోని గట్టు సింగారం, జుజ్జులరావు పేట గ్రామాల్లో నిర్వహించారు. గ్రామంలోని ప్రతి గడపకూ తిరుగుతూ కాంగ్రెస్ అధికారంలోకి వచ్చాక అమలు చేయబోయే సంక్షేమ పథకాలను కరపత్రాన్ని అందజేసి వివరించారు. వృద్ధులను, వికలాంగులను, మహిళలను, చిన్నారులను ఆప్యాయంగా పలకరించారు. వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు.
అధికారం చేపట్టాక ఆ సమస్యల పరిష్కారానికి కృషిచేస్తామని హామీ ఇచ్చారు. ఈ సందర్భంగా ప్రసాద్ రెడ్డి మాట్లాడుతూ పాలేరు నియోజకవర్గ అభివృద్ధికి కాంగ్రెస్ పార్టీ కట్టుబడి ఉంటుందని తెలిపారు. ఎవరూ అధైర్యపడాల్సిన అవసరం లేదని రాబోవు రెండు నెలల్లో జరిగే ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీదే అధికారమని పేర్కొన్నారు. అధికారంలోకి వచ్చాక నియోజకవర్గంలోని అన్ని ప్రధాన సమస్యలకు పరిష్కారం లభిస్తుందన్నారు. ఈ కార్యక్రమంలో మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు మట్టె గురవయ్య, సర్పంచ్ ఖాదర్ బాబు, వైస్ సర్పంచ్ సింహాద్రి, నాయకులు హఫీజ్ ఉద్దీన్, బజ్జూరి వెంకట్ రెడ్డి, జీవన్ రెడ్డి, దామోదర్ రెడ్డి, బారి వీరభద్రం, కొండా మహిపాల్, ఆలేటి రాము, సుధాకర్ రెడ్డి, సారబుడ్ల శ్రీనివాస రెడ్డి, దేవరపల్లి నాగిరెడ్డి, ముదిరెడ్డి కేశవరెడ్డి, శేశిరెడ్డి, పాపారావు, సుధాకర్, సత్యనారాయణ, వీరారెడ్డి, రమణ, ఇబ్రహీం, బుచ్చయ్య తదితరులు పాల్గొన్నారు.