సూర్యాపేట జిల్లా హుజూర్ నగర్ నియోజకవర్గ కేంద్రంలో బంజార హమాలి రేట్లు 22 శాతం పెంచారు. వర్తక సంఘం భవనంలో బుధవారం టిఆర్ఎస్ కె.వి అనుబంధ సంఘం హమాలి యూనియన్, వర్తక సంఘం కమిటీ టిఆర్ఎస్ కె.వి నియోజకవర్గ అధ్యక్షుడు పచ్చిపాల ఉపేందర్ సమక్షంలో చర్చించారు. ఈ చర్చలో భాగంగా ఇప్పటి వరకు ఉన్న రేట్లపై 22 శాతం పెంచారు. ఈ రేట్లు హోల్ సేల్,రిటైల్ వారికి వర్తిస్తుందని తెలిపారు.
ఈ కార్యక్రమంలో వర్తక సంఘం అధ్యక్షుడు ఉప్పల రమేష్,సెక్రటరీ మైలవరపు నాగేశ్వరరావు,కోశాధికారి రాపోలు వెంకన్న,బోనాల కృష్ణారావు, చిల్లంచర్ల ఆనంద్,అయ్యప్ప,హమాలి కమిటీ గౌరవ సలహాదారుడు శ్రీను,హమాలి అధ్యక్షుడు దేశబోయిన బాలకృష్ణ,కార్యదర్శి జక్కుల లింగయ్య, ఉపాధ్యక్షుడు మామిడి నరసింహారావు, కోశాధికారి మామిడి వీరబాబు,మేస్త్రీలు శీలం వెంకన్న,ఇంటి రామయ్య,గుర్రం కోటేశ్వరావు,దేశబోయిన వెంకన్న, హమాలి కార్మికులు పాల్గొన్నారు.
సత్యం న్యూస్, హుజూర్ నగర్