కరోనా వ్యాపిస్తున్న నేపథ్యంలో బ్యాంకులు కచ్చితమైన నిబంధనలు పాటించాలని ఖమ్మం జిల్లా కలెక్టర్ ఆర్ వి కర్ణన్ ఆదేశాలు జారీ చేశారు. ప్రభుత్వం ఇచ్చిన ఆర్ధిక సాయం తీసుకోవడానికి పెద్ద ఎత్తున కస్టమర్లు బ్యాంకులకు వచ్చే అవకాశం ఉన్నందున బ్యాంకుల్లో కచ్చితంగా సామాజిక దూరం పాటించే విధంగా చర్యలు తీసుకోవాలని ఆయన కోరారు.
బ్యాంకులోకి వచ్చే వారు కచ్చితంగా మాస్కు ధరించి రావాల్సిందేనని, అలా చేయని వారిపై చర్యలు తీసుకోవాలని కలెక్టర్ చెప్పారు. బ్యాంకులు ఉదయం 8 నుంచి మధ్యాహ్నం రెండు గంటల వరకూ పని చేయాలని ఆయన తెలిపారు. అన్ని ఏటీఎం ల వద్దా స్థలం ఉంటే టెంటు వేయాలని, కచ్చితంగా సామాజిక దూరం పాటించేలా చూడాలని కలెక్టర్ కోరారు.