కామారెడ్డి పట్టణంలోని ఎస్.ఆర్.కే కళాశాలలో బతుకమ్మ సంబరాలు ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా కామారెడ్డి మున్సిపల్ చైర్మన్ నిట్టు జాహ్నవి హాజరయ్యారు. విద్యార్థులతో కలిసి బతుకమ్మ ఆడారు. ఈ సందర్బంగా మున్సిపల్ చైర్మన్ మాట్లాడుతూ.. తెలంగాణ ప్రభుత్వం బతుకమ్మ సంబరాలు అధికారికంగా నిర్వహిస్తుందన్నారు.
తెలంగాణలో ఆడపడుచులు సంబరంగా జరుపుకునే అతి పెద్ద పండగ బతుకమ్మ అని తెలిపారు. కళాశాల కరెస్పాండెంట్ జైపాల్ రెడ్డి మాట్లాడుతూ.. ప్రతి సంవత్సరం కళాశాలలో బతుకమ్మ సంబరాలు ఘనంగా నిర్వహిస్తామన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా ఆస్పత్రి సూపరిండెంట్ డా. విజయలక్ష్మి, ఆర్టిఓ వాణి, మున్సిపల్ వైస్ చైర్మన్ ఇందుప్రియ, ఆర్కె గ్రూప్ ఆఫ్ కళాశాల కరస్పాండెంట్ జైపాల్ రెడ్డి, ఛైర్మన్ భాస్కర్ రావు, కళాశాల ప్రిన్సిపాల్ దత్తాత్రి కళాశాల సిబ్బంది, విద్యార్థులు పాల్గొన్నారు.