ఎన్నికలంటే మాటలా? మరీ ఇక ఎన్నికల్లో ఆయా పార్టీల అభ్యర్థులుగా నిలబడాలంటే ఆషామాషీ విషయమేమీ కాదు.
అయితే జీహెచ్ఎంసీ ఎన్నికలు – 2020లో టీడీపీ తరఫున బేగంపేట నుంచి కార్పొరేటర్గా పోటీ చేస్తున్న అభ్యర్థి ఫరీనా బేగంకు మద్ధతుగా నిలబడుతున్న వారందరినీ అభినందించాల్సిందే.
ఎందుకంటే ఫరీనా బేగం ఏమంత స్తితిమంతురాలేమీ కాదు (ఆర్థికంగా). ఆమె భర్త ఆటో డ్రైవర్ . భర్త కోరిక మేరకు ఎన్నికల్లో పోటీ చేసిన ఆమెకు మాజీ ఎమ్మెల్యే కాట్రగడ్డ ప్రసూన, నాయకులు సతీష్ మద్దతు తెలిపారు.
కేవలం మద్ధతు తెలపడమే గాకుండా ఆటో డ్రైవర్ భార్య అయిన కరీనా బేగంకు ఆర్థికంగా ఎన్నికల్లో అవసరాల నిమిత్తం (ఈసీ ఆదేశాల ప్రకారం ఖర్చులు మాత్రమే) ఆటోడ్రైవర్ల నుంచి విరాళాలు సేకరిస్తున్నారు.
ఈ విషయం అందరినీ ఆశ్చర్య పర్చడమే గాకుండా ఫరీనా బేగం ఎన్నికల్లో నిలబడడం, ఆమె భర్త ఆమెను వెన్నుదన్నుగా ప్రోత్సాహం ఇవ్వడం, దీనికి తోడు నాయకులు కూడా ఆమెకు సహాయ సహకారాలు అందించడం అందరినీ విశేషంగా ఆకట్టుకుంటోంది.
కాగా జీహెచ్ఎంసీ ఎన్నికలు ఫరీనా బేగంకు ఏ మేరకు సత్ఫలితాలిస్తాయో వేచి చూడాల్సిందే మరీ!