38.2 C
Hyderabad
May 2, 2024 20: 14 PM
Slider నల్గొండ

రైల్వే అండర్ పాస్ బ్రిడ్జి పనులను త్వరితగతిన పూర్తి చేయాలి

#railwaybridge

సూర్యాపేట జిల్లా హుజూర్ నగర్ నియోజకవర్గ మేళ్ళచెరువు ఎల్ సి నెంబర్ 33 అండర్పాస్ బ్రిడ్జి పనులు గత సంవత్సరం ప్రారంభం కాగా అట్టి పనుల పురోగతిని సంబంధిత రైల్వే అధికారులను దక్షిణ మధ్య రైల్వే జోనల్ కమిటీ సభ్యుడు యరగాని నాగన్న గౌడ్  వివరాలు అడిగి తెలుసుకొని సంబంధిత డిప్యూటీ సి ఈ రామారావు తో మాట్లాడారు.అండర్ పాస్ లైన్ పర్మిషన్ అనంతరం 45 రోజులలోగా పనులను పూర్తి చేస్తామని హామీ ఇచ్చారని నాగన్న తెలిపినారు.సంబంధిత కేంద్ర రైల్వే మంత్రి తో నల్లగొండ పార్లమెంటు సభ్యుడు  ఉత్తంకుమార్ రెడ్డి అనేక మార్లు ఎన్నో సంవత్సరాలుగా ఈ ప్రాంత ప్రజలకు ఇబ్బందులకు గురిచేస్తున్న ఈ పనులపై, బ్రిడ్జి నిర్మాణం త్వరిత గతిన పూర్తి చేయడానికి కావలసిన నిధుల విషయంలో ఎప్పటికప్పుడు మాట్లాడుతున్నారని యరగాని నాగన్న గౌడ్ తెలిపారు.

ఈ కార్యక్రమంలో సైట్ ఇన్చార్జి యజ్ఞనారాయణ చారి,ఎంపీటీసీ వెంకట్ రెడ్డి,జిల్లా ఓబీసీ సెల్ అధ్యక్షుడు శెట్టి రామచంద్రయ్య,ఐ ఎన్ టి యు సి నాయకులు బెల్లంకొండ గురవయ్య, చింతకాయల రాము,గోలి శంభయ్య తదితరులు పాల్గొన్నారు.

సత్యం న్యూస్ ప్రతినిధి, హుజూర్ నగర్

Related posts

కాంగ్రెస్ అధ్యక్షుడిగా బాధ్యతలు స్వీకరించిన ఖర్గే

Satyam NEWS

సంక్రాంతి..సర్వజన సుఖశాంతి

Satyam NEWS

బేతని చర్చ్ లో క్రిస్మస్ కానుకల పంపిణీ

Satyam NEWS

Leave a Comment