శ్రీకాకుళం జిల్లా కోటబొమ్మాలి మండలంలో కే.జీ.బీ.వీ విద్యార్థులు ఇంటర్ మీడియట్ లో విజయ దుందుభి మోగించారు. మొదటి సంవత్సరం ఇంటర్మీడియట్ ఫలితాలలో బై. పి .సి., ఎం.పి .సి., గ్రూపులో 76% ఉత్తీర్ణత పొందారు.
రెండవ సంవత్సరం ఇంటర్మీడియట్ ఫలితాలలో బై. పి .సి., ఎం.పి .సి., గ్రూపులో 70% ఉత్తీర్ణత పొందారు. నలుగురు విద్యార్ధులు జంతు శాస్త్రం లో 10/10 పాయింట్లు సాధించారు. జిల్లాలలోని 21 ఇంటర్మీడియట్ కళాశాలలో కోటబొమ్మాలి కే.జీ.బీ.వీ .,ఇంటర్మీడియట్ విద్యార్థులు, ఫలితాలలో ప్రధమ స్థానంలో నిలిచారు.
ఈ ఫలితాలు రావడానికి కళాశాల ప్రత్యేక అధికారిణి సరస్వతి, కళాశాల అధ్యాపకులు స్వర్ణ లతా, మహాలక్ష్మి , సుమాంజలి, స్వాతి బిందు, బాలమణి, లక్ష్మి ప్రసన్న కాగా వారిని శ్రీకాకుళం జిల్లా సమగ్ర శిక్ష ప్రాజెక్టు అధికారి బి.చంద్రకళ, సమగ్ర శిక్ష అదనపు ప్రాజెక్టు కోఆర్డినేటర్ పి. వెంకటరమణ.,సమగ్ర శిక్ష అధికారులు, జి. సి. డి. ఓ. పై అధికారులు అభినందించారు.