పేరు చివరిలో రెండు అక్షరాలు ఉంటేనే పదవులు దక్కుతున్నాయని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పార్లమెంటు సభ్యుడు రఘురామ కృష్ణం రాజు తీవ్రంగా విమర్శించారు. పేరు చివర రెండు అక్షరాలు ఉన్న వారికి పదవులు వస్తున్నాయనే విషయం తాను ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదని ఆయన అన్నారు.
ఇప్పటి వరకూ పదవులు దక్కించుకున్న వారి జాబితా చూస్తే తాను చెప్పిన విషయం సులభంగానే అర్ధం అవుతుందని ఆయన తెలిపారు. ఆంధ్రప్రదేశ్ లో అతి చిన్న కులంగా ఉన్న క్షత్రియుల మధ్య చీలికలు తెచ్చే పనులు చేయవద్దని ఆయన ముఖ్యమంత్రి వై ఎస్ జగన్ మోహన్ రెడ్డి కోటరీని ఆయన కోరారు.
ఇటీవలి కాలంలో వై ఎస్ ఆర్ కాంగ్రెస్ పార్టీ పై నిశిత విమర్శలు చేస్తున్న వైఎస్ ఆర్ కాంగ్రెస్ పార్టీ నర్సాపురం పార్లమెంటు సభ్యుడు నేడు బహిరంగంగానే విమర్శలు చేశారు. కుల రాజకీయాలు చేయవద్దని, క్షత్రియ కులంలో చీలికలు తెచ్చే ప్రయత్నాలు చేయవద్దని వై ఎస్ జగన్ మోహన్ రెడ్డి కోటరీని ఆయన కోరారు.