సిపిఐ జాతీయ సమితికి ఖమ్మం జిల్లా పార్టీ మాజీ కార్యదర్శి బాగం హనుమంతరావు ఎన్నికయ్యారు. ఇటీవల విజయవాడ లో జరిగిన సిపిఐ జాతీయ మహాసభలలో ఆయనను ఎన్నుకున్నారు. విద్యార్ధి దశ నుండి సిపిఐ అనుబంధ సంఘాలలో పనిచేసిన బాగం ఖమ్మం జిల్లా సిపిఐ కార్యదర్శి గా కూడా పనిచేశారు. జాతీయ సమితి కి ఎన్నికైన భాగంను సిపిఐ జిల్లా కార్యదర్శి పోటు ప్రసాద్ అభినందించి సత్కరించారు. ఈ కార్యక్రమంలో జిల్లా కార్యవర్గ సభ్యులు రావి శివరామకృష్ణ, తాటి వెంకటేశ్వర్లు AISF జిల్లా కార్యదర్శి ఇటికాల రామకృష్ణ ఆఫీస్ కార్యదర్శి శ్రీనివాసరావు సిపిఐ నాయకులు జోల నరసింహారావు తదితరులు పాల్గొన్నారు
next post