30.7 C
Hyderabad
May 5, 2024 05: 17 AM
Slider ఖమ్మం

కార్యకర్తలను పరామర్శించిన భట్టి విక్రమార్క

#Bhatti Vikramarka

కామేపల్లి మండలం పండితాపురం గ్రామంలో టిఆర్ఎస్ నాయకుల చేతిలో గాయపడిన కాంగ్రెస్ కార్యకర్తలను ఖమ్మం ప్రభుత్వ దవాఖానాలో సీఎల్పీ నేత మల్లు భట్టి విక్రమార్క పరామర్శించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ… ఘర్షణ వివరాలను అడిగి తెలుసుకున్నారు. తెలంగాణ జన గర్జన సభకు మండలంలో తిరిగి భారీగా జన సమీకరణ చేశామని నెపంతో టిఆర్ఎస్ నాయకులు తమపై విచక్షణారహితంగా దాడి చేశారని బాధితులు బత్తుల నాగరాజు, బానోతు రామచంద్రు, మేకపోతుల మహేష్ భట్టికి వివరించారు.

దాడి చేసిన వారిపై చట్టపరమైన చర్యలు తీసుకునే విధంగా పోలీస్ వారితో మాట్లాడి న్యాయం చేస్తానని గాయ పడ్డ ప్రతి కార్యకర్త కు అండగా ఉంటామని హామీ ఇచ్చారు.అదే విధంగా జనగర్జన సభకు వచ్చి వెళుతున్న సమయంలో యాక్సి డెంట్ అయిన బోనకల్ మండలం కలకోట గ్రామ కాంగ్రెస్ కార్యకర్త ఖాసీం (బాబు )ను పరామర్శించినారు.

ఈ కార్యక్రమంలో వీరితో పాటు జిల్లా కాంగ్రెస్ కమిటి అధ్యక్షులు పువ్వాళ్ళ దుర్గాప్రసాద్, ఉపాధ్యక్షులు పోట్ల నాగేశ్వరావు,పి సి సి సభ్యులు రాయల నాగేశ్వరావు,జిల్లా కాంగ్రెస్ నాయకులు పైడిపల్లి కిషోర్,బుల్లెట్ బాబు,ఐనాల నరసింహారావు,కందిమల్ల వీరబాబు,వనం బాబు,వేమిరెడ్డి శ్రీనివాస్ రెడ్డి,పుచ్చాకాయల వీరబద్రం,మద్ది వీరారెడ్డి,హుస్సేన్, కార్పొరేటర్లు దుద్ధుకూరి వెంకటేశ్వర్లు,మలీదు వెంకటేశ్వర్లు,లకావత్ సైదులు నాయక్,మాజీ కౌన్సిలర్ పాలకుర్తి నాగేశ్వరావు తదితర నాయకులు పాల్గొన్నారు.

Related posts

మూడోసారి అధికారంలోకి రావడానికి మళ్లీ బిఆర్ఎస్ మాయాజాలం

Satyam NEWS

దెందులూరు వైసిపి ఎన్నికల ప్రచారంలో ఘోర అపశృతి

Satyam NEWS

టిఆర్ఎస్, కాంగ్రెస్ లను తిరస్కరించండి

Satyam NEWS

Leave a Comment