కేశినేని నానిని చేర్చుకుని సంతోష పడుతున్న వైసీపీ నేతలకు షాక్ తగిలింది. విజయవాడకు చెందిన వైసిపి నేత బొప్పన భవకుమార్ తెలుగుదేశం పార్టీలో చేరేందుకు వారం క్రితం టిడిపికి చెందిన నేత కేశినేని శివనాథ్(చిన్ని)తో చర్చలు జరిపారు. ఈ విషయం తెలుసుకున్న వైసీపీ అధిష్టానం దేవినేని అవినాష్ ను పంపించి బొప్పన భవకుమార్ ను బుజ్జగించింది. అయితే ఆయన చేసిన ప్రయత్నం ఫలించలేదు. ఇటీవల టిడిపి నేత వంగవీటి రాధా మరియు గద్దె రామ్మోహన్ వెళ్లి వైసీపీ నేత బొప్పన భవ కుమార్ ని కలవడం జరిగింది. ఆ తర్వాత జరిగిన పరిణామాలలో రేపు(17-01-2024) సాయంత్రం 3:00 గంటలకు టిడిపి నేత కేశినేని శివనాథ్(చిన్ని) తో కలసి నారా లోకేష్ ను బొప్పన భవకుమార్ కలవడానికి అంగీకరించారు.
previous post