42.2 C
Hyderabad
April 26, 2024 17: 15 PM
Slider మెదక్

షాకింగ్: పెళ్లి పీటలపైకి ఎక్కాల్సిన యువకుడి హత్య

sidipet murder

పెళ్లి పీటలపైకి ఎక్కాల్సిన ఒక యువకుడు దారుణ హత్యకు గురయ్యాడు. సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ మండల కేంద్రంలోని ఎల్లమ్మ చెరువుకట్టపై ఈ దారుణం చోటు చేసుకుంది. పూసల శ్రీకాంత్ అనే యువకుడికి వచ్చే నెల 25న పెళ్లి జరగాల్సి ఉండగా అంతలోనే ఈ ఘోరం జరిగింది.

కొందరు గుర్తు తెలియని వ్యక్తులు బీరు సీసా పగలగొట్టి దాంతో అతడిని పొడిచి చంపారు. ఆ తర్వాత వెంటనే వల్లపు శ్రీనివాస్ అనే వ్యక్తి తానే హత్యకు పాల్పడ్డానంటూ పోలీస్ స్టేషన్లో లొంగిపోయాడు. మృతుడు శ్రీకాంత్ ఇసుక వ్యాపారం చేస్తుంటాడు. ఈ క్రమంలో కమీషన్ల కోసం గొడవ నెలకొనడంతోనే తాగిన మైకంలో శ్రీకాంత్ ను బీరుసీసాలతో పొడిచి దారుణంగా హత్య చేసినట్టుగా అనుమానిస్తున్నారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. లొంగిపోయిన శ్రీనివాస్ తో పాటు మొత్తం ఎనిమిది మంది కలిసి ఈ హత్య చేసుంటారన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. శ్రీకాంత్ హత్యతో ఆ కుటుంబంలో విషాదం నెలకొంది.

Related posts

సైమన్ కమీషనుకు గుండెలు చూపిన ధీరుడు టంగుటూరి ప్రకాశం పంతులు

Satyam NEWS

లహరి-అమ్మఒడి అనుభూతి

Murali Krishna

వనపర్తిలో స్వరాజ్ ట్రాక్టర్ షోరూమ్ నిర్వాహకుడు కారుకు చలాన

Satyam NEWS

Leave a Comment