36.2 C
Hyderabad
May 7, 2024 14: 11 PM
Slider నల్గొండ

మట్టపల్లి లక్ష్మీ నృసింహ దేవస్థానానికి భారీ విరాళం

#MallapallyTemple

సూర్యాపేట జిల్లా మట్టపల్లి లక్ష్మీ నృసింహ దేవస్థానానికి చెన్నూరి ఆదిత్య కుమార్ రూ. 7,51,116 విరాళాన్ని అందచేశారు. బుధవారం మట్టపల్లి శ్రీలక్ష్మీనరసింహస్వామి వారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించి అనంతరం నిత్య కైంకర్యాల కోసం విరాళాన్ని అందచేశారు.

ఈ సందర్భంగా ఆదిత్య కుమార్ దంపతులు మాట్లాడుతూ  తమ ఆరాధ్య దైవమైన శ్రీ మట్టపల్లి లక్ష్మీనరసింహ స్వామి వారికి నిత్య కైంకర్యాల నిమిత్తం పెదవీడు గ్రామంలో ఉన్న తన తాత తండ్రుల నుంచి వారసత్వంగా వచ్చిన ఆస్తిని విక్రయించి స్వామివారి సేవలకై ఇస్తున్నట్లు తెలిపారు.

వృత్తిరీత్యా తాను సాఫ్ట్ వేర్ ఇంజనీర్ గా హైదరాబాదులో పని చేస్తున్నానని తన తన నాయనమ్మతాతయ్య చెన్నూరి హనుమంతరావు, ఆండాళమ్మ, తల్లిదండ్రులు చెన్నూరి లక్ష్మీ నరసింహారావు, రాధ పేరు చిరస్థాయిగా ఉండిపోవాలని తాను ఈ నిర్ణయం తీసుకొని  స్వామివారికి చెందే విధంగా ఇచ్చినట్లు తెలిపారు.

Related posts

కేంద్ర నిర్ణయం ఉపసంహరణ: జైనుల పుణ్యక్షేత్రం యధాతధం

Satyam NEWS

కొల్లాపూర్ చేరుకున్న రాజ్యాంగ పరిరక్షణ యుద్ధ భేరి ప్రచార యాత్ర

Satyam NEWS

పేదల ఇండ్లను కూల్చే ప్రయత్నాలను విరమించుకోవాలి

Satyam NEWS

Leave a Comment