26.7 C
Hyderabad
May 16, 2024 09: 59 AM
Slider కడప

ఓటమి భయంతో దాడులు చేస్తున్న వైసీపీ గూండాలు

#bjp

అన్నమయ్య జిల్లా రాజంపేటలో శనివారం బీజేపీ పార్లమెంటరీ కార్యాలయంలో రాష్ట్ర బీజేపీ కార్యదర్శి నాగోతు రమేష్ నాయుడు మీడియా సమావేశం నిర్వహించారు. గుంటూరులో బీజేపీ జాతీయ కార్యదర్శి సత్యకుమార్ వైసీపీ నేతల దాడి ని ఖండించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్రంలో వైసీపీ ఓడి పోతుందనే దాడులకు పాల్పడు తున్నారని ఆరోపించారు. ఢిల్లీలో ఉన్నది ప్రధాని మోడీ ప్రభుత్వం అని,మీ ఆటలు సాగవని అన్నారు. ఏపీలో బీజేపీ నేతలపై దాడులు చేసి డిల్లీ కి వెళ్లి పెద్దల కాళ్ళు పట్టుకుంటాం అంటే కుదరదని అన్నారు.

వైసీపీ నేతలు ఒళ్ళు దగ్గర పెట్టుకోవాలి,చర్యకు ప్రతి చర్యలు ఉంటాయని హెచ్చరించారు. పోలీసుల అండచూసుకొని సత్యకుమార్ పై దాడికి పాల్పడ్డారని, పోలీసులు ఖాకి దుస్తులు వీడి, వైసీపీ పార్టీ దుస్తులు వేసుకుంటే తమకే మాత్రం అభ్యంతరం లేదని అన్నారు. దేశంలోనే ఏపీ ని పాలించిన అద్వాన్నపు ముఖ్యమంత్రి గా జగన్మోహన్ రెడ్డి నిలిచిపోయారని విమర్శించారు.

బిజెపి రాష్ట్ర పొలిటికల్ ఫీడ్బ్యాక్ మెంబర్ సాయి లోకేష్ కుమార్ మాట్లాడుతూ రాజధాని రైతులు ఉద్యమిస్తున్న తరుణంలో , రైతులు చేసిన దీక్ష 1200 రోజులు పూర్తి అయిన సందర్భంగా వారు సభ పెట్టుకుని,రాష్ట్ర ప్రభుత్వానికి వారి గోడు వెళ్ళబోసు కుంటుంటే, భారతీయ జనతా పార్టీ తరపున జాతీయ కార్యదర్శి సత్యకుమార్ వెళ్లి వారికి మద్దతు తెలిపి తిరుగు ప్రయాణం అవుతుండగా మార్గమధ్యలో వైసిపికి చెందిన గుండాలు కాన్వాయ్ పై రాళ్ల దాడి చేసి, వారిపై దాడి చేయడం నిజంగా ప్రజాస్వామ్యానికి చీకటి రోజుగా అభి వర్ణిస్తున్నామన్నారు. ముఖ్యమంత్రి కి ఒకటి విజ్ఞప్తి చేస్తున్నాం! మీ పార్టీ కార్యకర్తలు తప్పు చేసినా కూడా ఆ బాధ్యత మీదే అవుతుందని,భవిష్యత్తులో ఇలాంటివి పునరావృతం కాకుండా చూసుకోవాలని ఆయన డిమాండ్ చేశారు.

Related posts

న్యూయార్క్ కోర్టులో భారత్‎కు ఊరట.. కెయిర్న్​ ప్రయత్నాలకు అడ్డుకట్ట

Sub Editor

తెలంగాణను ఊటీగా తీర్చిదిద్దేందుకు చర్యలు

Satyam NEWS

కాలనీల సమస్యల దశలవారీగా పరిష్కారానికి కృషి

Satyam NEWS

Leave a Comment