విజయనగరం జిల్లా కేంద్రంలో జిల్లా కోర్టుకు దగ్గరలోఉన్న ప్రదీప్ నగర్ స్థల వివాదం పుణ్యమా…ఈ నెల 19 మంత్రి బొత్స సత్యనారాయణ…తనసొదరుడు ఇంట్లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో చెప్పిన మాటలు..రాజకీయ చిచ్చు రాజుకుంటోంది.మీకేం సంబంధమని…ఇష్టానుసారంగా ఇండ్లపట్టాలిస్తారంటూ బీజేపీ ధ్వజమెత్తింది. ఈ రెండున్నర కాలంలో 14న్నర కోట్లు ఏ విధంగా ఖర్చు పెడాతరని…దీనిపై తక్షణం శ్వేతపత్రం విడుదల చేయాలంటూ బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు సొము వీర్రాజు డిమాండ్ చేసారు. కాకి లెక్కలతో కేంద్రాన్ని తప్పుదోవ పట్టిస్తున్నారంటూ సోము వీర్రాజు ధ్వజెమత్తారు. దీనికి తోడు ఆదేకాకి లెక్కలతో రాస్ట్రాన్నిఅధోగతి పాలుచేసారని ఆరోపించారు.. ఇండ్ల నిర్మాణాంలో కేంద్రం ఇచ్చిన డబ్బునకు సకాలంలో ఖర్చు చేయక వాటికి లెక్కలు అప్పచెప్పన కాలయాపన చేసారని సోము వీర్రాజు విమర్శించారు. ఈ రెండున్నర కాలంలో మంజూరైన ఇండ్లు ఎన్ని…వ్యయం చేసిన సొమ్ము ఎంత…? ఎంతమంది లబ్దిదారులు..ఇండ్ల పొందారు.అన్న విషయాలకు సమాధానం చెప్పాలన్నారు. ఇవేవీ చెప్పక…వైఎస్ఆర్ హాయంలోఇందిరమ్మ ఇండ్లు ఇచ్చాం..జగన్ హాయంలో…పేదలందరికీ ఇండ్లు నిర్మిస్తున్నామంటూ కాకి లెక్కలు చెప్పడం సరికాదన్నారు..