ఆరు గ్యారెంటీ లు అమలు చేయని కాంగ్రెస్ ప్రభుత్వానికి పార్లమెంట్ ఎన్నికల్లో తగిన బుద్ది చెప్పాలని కామారెడ్డి ఎమ్మెల్యే కాటిపల్లి వెంకట రమణారెడ్డి అన్నారు. పార్లమెంట్ ఎన్నికల ప్రచారంలో భాగంగా జహీరాబాద్ పార్లమెంట్ అభ్యర్థి బీబీపాటిల్ ప్రచార రథాలకు క్యాంప్ కార్యాలయం వద్ద జహీరాబాద్ ఎన్నికల ఇంచార్జి, ఎమ్మెల్యే కాటిపల్లి వెంకట రమణారెడ్డి పూజా కార్యక్రమాలు నిర్వహించిన అనంతరం జండా ఊపి ప్రచారాన్ని ప్రారంభించారు. అనంతరం మాట్లాడుతూ.. దేశంలో సుస్థిర పాలన, వికసిత భారత్ బీజేపీ లక్యమన్నారు. జహీరాబాద్ పార్లమెంట్ సభ్యునిగా బీబీ పాటిల్ ను అత్యధిక మెజారిటీతో గెలిపించాలని కోరారు. ప్రధాని మోది నాయకత్వంలో బీజేపీకి 370 పార్లమెంట్ సీట్లు రావటం ఖాయమని ఆశాభావం వ్యక్తం చేసారు.
సత్యం న్యూస్, కామారెడ్డి