బీజేపీ ఎంపీ రామ్ చందర్ జాంగ్రా కారును హర్యానాలోని హిసార్లో కొంతమంది రైతు నిరసనకారులు ధ్వంసం చేశారు. కేంద్రం తీసుకువచ్చిన నూతన వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా రైతులు నిరసన చేపట్టారు.
ఎంపీ రామ్ చందర్ జాంగ్రా దీపావళి వేడుకల్లో పాల్గొని.. వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా నిరసన తెలుపుతున్న రైతులు.. నిరుద్యోగ తాగుబోతులని వివాదాస్పత వ్యాఖ్యలు చేశారు. దీంతో రైతులు ఎంపీని హిసార్లో పెద్ద ఎత్తున నిరసన తెలుపుతూ అడ్డగించారు.