సంగారెడ్డి జిల్లా భాజపా సమావేశానికి వెళ్లి తిరిగి ప్రయాణం లో బిజెపి రాష్ట్ర అధ్యక్షులు బండి సంజయ్ మియాపూర్ నుండి నాంపల్లి భాజపా కార్యాలయం వరకు మెట్రో రైల్ లో ప్రయాణించారు.
ఆయన తో పాటు తెలంగాణ విమోచన కమిటీ చైర్మన్ సంగారెడ్డి జిల్లా ఇంచార్జ్ శ్రీవర్ధన్ రెడ్డి తదితరులు ఉన్నారు. ఈ సందర్భంగా బండి సంజయ్ మాట్లాడుతూ హైదరాబాద్ ప్రజలకు మెట్రో రైలు అందుబాటులోకి తీసుకరావడం కేంద్ర ప్రభుత్వం నిధులతోనే జరిగిందన్నారు.
తెలంగాణ లో ఏ పథకం తీసుకున్న వందశాతం కేంద్ర ప్రభుత్వం నిధులే అని అన్నారు. రాష్ట్రానికి కేంద్ర నిధులు ఇచ్చినా కూడా తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ మాత్రం కేంద్రం ఒక్క రూపాయి కూడా ఇవ్వడం లేదని చెప్పి ప్రజలను తప్పుదోవ పట్టిస్తున్నారని బండి సంజయ్ అన్నారు.
అబద్దాలు ఆడడం తెరాస ప్రభుత్వానికి అలవాటయ్యిందని ఆయన విమర్శించారు.