33.2 C
Hyderabad
May 11, 2024 14: 20 PM
Slider ముఖ్యంశాలు

మెట్రోరైలు లో ప్రయాణించిన బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు

#Hyderabad Metro

సంగారెడ్డి జిల్లా భాజపా సమావేశానికి వెళ్లి తిరిగి ప్రయాణం లో బిజెపి రాష్ట్ర అధ్యక్షులు బండి సంజయ్  మియాపూర్ నుండి నాంపల్లి భాజపా కార్యాలయం వరకు మెట్రో రైల్ లో  ప్రయాణించారు.

ఆయన తో పాటు తెలంగాణ విమోచన కమిటీ చైర్మన్ సంగారెడ్డి జిల్లా ఇంచార్జ్ శ్రీవర్ధన్ రెడ్డి తదితరులు ఉన్నారు. ఈ సందర్భంగా బండి సంజయ్ మాట్లాడుతూ హైదరాబాద్ ప్రజలకు మెట్రో రైలు  అందుబాటులోకి తీసుకరావడం కేంద్ర ప్రభుత్వం నిధులతోనే జరిగిందన్నారు.

తెలంగాణ లో ఏ పథకం తీసుకున్న వందశాతం కేంద్ర ప్రభుత్వం నిధులే అని అన్నారు. రాష్ట్రానికి కేంద్ర నిధులు ఇచ్చినా కూడా తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ మాత్రం కేంద్రం ఒక్క రూపాయి కూడా ఇవ్వడం లేదని చెప్పి ప్రజలను తప్పుదోవ పట్టిస్తున్నారని బండి సంజయ్ అన్నారు.

అబద్దాలు ఆడడం తెరాస ప్రభుత్వానికి అలవాటయ్యిందని ఆయన విమర్శించారు.

Related posts

ట్రాజెడీ:తల్లి అంత్యక్రియలకు వస్తూ కొడుకు కోడలు మృతి

Satyam NEWS

ప్రజా సమస్యల సత్వర పరిష్కారానికి చర్యలు

Sub Editor

విత్ లాక్ డౌన్ రూల్స్: ‘వల్లూరిపల్లి’వారి వివాహ నిశ్చితార్థం

Satyam NEWS

Leave a Comment