ప్రముఖ నిర్మాత వల్లూరిపల్లి రమేష్-గీత దంపతుల పెద్ద కుమారుడు రాఘవేంద్ర మహర్షి వివాహ నిశ్చితార్థం నిరాడంబరంగా జరిగింది. హైదరాబాద్ కు చెందిన అత్తలూరి సాంబశివరావు-శ్రీదేవి దంపతుల కుమార్తె శ్రీజతో వివాహం జరగనున్నది.
ప్రస్తుతం అమలులో ఉన్న లాక్ డౌన్ నిబంధనలకు లోబడి కుటుంబ సభ్యుల సమక్షంలో నిశ్చితార్థం నిరాడంబరంగా జరిగింది. యు ట్యూబ్ లైవ్ ద్వారా ఈ శుభకార్యాన్ని బంధుమిత్రులంతా వీక్షించి శుభాశీస్సులు అందించారు.