బిచ్కుందలో బీజేపీ (భారతీయ జనతా పార్టీ) గెలుపు సంబురాలు మిన్నంటాయి. బిచ్కుంద మండల కేంద్రంలోని బీజేపీ ఆధ్వర్యంలో గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికల్లో భాగంగా బీజేపీ భారీస్థాయిలో అభ్యర్థులను గెలిపించుకోవడంతో మండల పార్టీ శ్రేణులు విజయోత్సవ ర్యాలీ నిర్వహించారు.
ఈ సందర్భంగా బీజేవైఎం నాయకులు విష్ణు మాట్లాడుతూ నాలుగు స్థానాల నుండి ఏకంగా నలభై తొమ్మిది స్థానాలకు గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికల్లో తమ పార్టీ పాగా వేసిందని రానున్నఅసెంబ్లీ ఎన్నికల్లో సైతం తెరాసను చిత్తుగా ఓడిస్తామని ధీమా వ్యక్తం చేశారు. తెలంగాణ రాష్ట్రం త్యాగాల పునాదులపై ఆవిర్భవించినప్పటికీ, కుటుంబ పాలన కొనసాగుతోందని ఆరోపించారు. భారత దేశాన్ని అన్ని విధాలుగా అభివృద్ధి చేస్తున్నమోదీ పాలనకు ప్రతిఒక్కరూ ఆకర్షితులవుతున్నారని పేర్కొన్నారు. వచ్చే ఎమ్మెల్యే ఎన్నికల్లో తెలంగాణతో పాటు కేంద్రంలో కూడా బీజేపీ ప్రభుత్వ౦ వస్తుందని జోస్యం చెప్పారు. అనంతరం కార్యకర్తలకు స్వీట్లు పంచిపెట్టి సంబరాలు నిర్వహించుకున్నారు.
ఈ కార్యక్రమంలో బీజేపీ అధ్యక్షులు కృష్ణారెడ్డి, సందీప్, పత్తి రమేష్, శ్రీధర్ పంతులు తదితరులు పాల్గొన్నారు.