26.7 C
Hyderabad
May 3, 2024 10: 05 AM
Slider కడప

వైఎస్ రాజారెడ్డి క్రికెట్ స్టేడియం ప‌రిశీల‌న‌

Stadium

రిమ్స్ సమీపంలోని వైఎస్ రాజారెడ్డి క్రికెట్ స్టేడియంను జిల్లా కలెక్టర్ సి.హరికిరణ్ పరిశీలించారు. నగర శివార్లలోని వైఎస్ రాజారెడ్డి జిల్లా క్రికెట్ స్టేడియం ఆవరణలో.. దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డి, ఆయన తండ్రి దివంగత వైఎస్ రాజారెడ్డి విగ్రహాల ఏర్పాటు విషయమై.. జాయింట్ కలెక్టర్ (అభివృద్ధి) సాయికాంత్ వర్మ, జిల్లా క్రికెట్ అసోసియేషన్ ప్రెసిడెంట్ ఎం.భరత్ రెడ్డిలతో కలిసి జిల్లా కలెక్టర్ స్థలాన్నిపరిశీలించారు.

ఈ సందర్బంగా కలెక్టర్ మాట్లాడుతూ.. ఈ నెలలో రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి జిల్లా పర్యటన నేపథ్యంలో.. దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డి, వారి తండ్రి దివంగత వైఎస్ రాజారెడ్డి విగ్రహాలను.. ఆయన చేతుల మీదుగా అవిష్కరించనున్నట్లు తెలిపారు. అందుకుగాను.. విగ్రహాల ఏర్పాటు పనులను పరిశీలించామ‌న్నారు.

అంతేకాకుండా.. ఇప్పటివరకు క్రికెట్ స్టేడియంలో నిర్వహించిన టోర్నమెంటుల వివరాలను, చిత్రాలను పోస్టర్ల ద్వారా ప్రదర్శించాలని సంబంధిత అధికారులను ఆదేశించారు. ఈ సందర్భ‌గా స్టేడియంలోని అన్ని రకాల వసతులు, సౌకర్యాలను పరిశీలించారు.

ఈ కార్యక్రమంలో.. స్టేడియం సెక్రెటరీ అజయ్ కుమార్ రెడ్డి, ఈ.సి. సభ్యులు మునికుమార్ రెడ్డి, మహీంద్రా రెడ్డి, ఖాజామోహిద్దీన్, రెహ్మాన్, ఏఓ శ్రీనివాసులు, కోచ్ ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు.

Related posts

పేద ప్రజల సంక్షేమానికి కేసీఆర్ ప్రభుత్వం కృషి

Satyam NEWS

కాకతీయ వర్సిటీలో జిమ్ సౌకర్యం ఏర్పాటు చేయాలి

Bhavani

రైలు ప్రమాదానికి మోడీదే నైతిక బాధ్యత

Bhavani

Leave a Comment